మంగళావరం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 413 పాయింట్లు నష్టపోయి 61,932 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు పతనమై 18,286 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 128 పాయింట్ల లాభంతో 62,474.11 వద్ద ప్రారంభమైంది. కానీ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. స్టాక్ మార్కెట్ ను ప్రధానంగా HDFC ట్విన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)మార్కెట్ ను డ్రాగ్ చేశాయి.
హెచ్డిఎఫ్సి ట్విన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటిసి, భారతీ ఎయిర్టెల్తో సహా ఇటీవల లాభపడిన కొన్ని స్టాక్ ల్లో లాభాల స్వీకరణతే పడిపోయాయి. మిడ్, స్మాల్క్యాప్లు బెంచ్మార్క్లు గ్రీన్లో ముగిశాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం లాభంతో ముగిసింది.

ముడి చమురు బ్యారెల్ $75 వద్ద ట్రేడవుతుంది. రూపాయి 9 పైసలు పెరిగి డాలర్కు 82.21 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్లో 17 స్టాక్ లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఇండెక్స్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు టాప్ లూజర్గా ఉన్నాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.72 శాతం, ఐటీ 0.18 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.02 శాతంతో లాభాల్లో ముగిశాయి. మిగతా రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ముగిశాయి.
స్మాల్, మిడ్-క్యాప్ స్టాక్లు మెరుగైన పనితీరు కనబరిచినప్పటికీ, హెవీవెయిట్ స్టాక్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ బెంచ్మార్క్ నష్టాలను మూటగట్టుకుంది.


Click it and Unblock the Notifications