Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పవర్ స్టాక్ ల్లో ర్యాలీ..

శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 97 పాయింట్లు పెరిగి 2,055 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సెస్ బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్ టీ లాభాల్లో ముగిశాయి.

హెచ్ సీఎల్ టెక్, ఎస్బీఐఎన్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్ఎం, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్ 1.5% లాభపడింది, FMCG, ఆటో మరియు ఫార్మా 1% చొప్పున పెరిగాయి. నిఫ్టీ రియాల్టీ 0.4 శాతం, నిఫ్టీ PSU బ్యాంక్ 0.3 శాతం తగ్గాయి. వెటర్నరీ వ్యాక్సిన్ తయారీదారు గత సంవత్సరంతో పోలిస్తే త్రైమాసిక లాభంలో 9% పెరుగుదలను ప్రకటించిన తర్వాత హెస్టర్ బయోసైన్సెస్ షేర్లు 9% పెరిగాయి.

Stock markets ended in gains with a rally in power stocks

టాటా పవర్ కంపెనీ గత 12 నెలల్లో చేపట్టిన కార్యక్రమాలు, పెట్టుబడులు వచ్చే 12-18 నెలల్లో ఫలితాలను చూపుతాయని మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీర్ సిన్హా చెప్పారు. గత నాలుగు సంవత్సరాలలో, కంపెనీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. మరో రూ.20,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందన్నారు. ఇందులో దాదాపు సగం పునరుత్పాదక వ్యాపారంలో పెట్టుబడి ఉంటుందన్నారు.

జనవరి-మార్చి (Q4FY24) త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన (YoY) లాభం రెండింతలు పెరిగి రూ. 3,010 కోట్లకు చేరిన తర్వాత మే 10న పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు 1.8 శాతం లాభపడి రూ.124.3కి చేరాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+