కరోనా వైరస్ లాక్ డౌన్ తో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని ఒడిదుడుకులకు లోనైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కాస్త కుదుటపడుతున్నాయా అనిపిస్తుంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి దేశీయ సెన్సెక్స్ 32 వేల పాయింట్ల మార్కును దాటి రెండో రోజు ర్యాలీ కొనసాగించింది . వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు జోరు చూపించటంతో కాస్త ట్రేడింగ్ లో కాస్త జోష్ వచ్చింది.

32,000 పాయింట్ల మార్క్ను దాటిన సెన్సెక్స్
నిన్న 1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ తాజాగా మరో 595 పాయింట్లు బలపడింది. వెరసి 32,000 పాయింట్ల మార్క్ను దాటింది సెన్సెక్స్ . 32,200 వద్ద నేడు ట్రేడింగ్ ముగిసింది . నిఫ్టీ సైతం 175 పాయింట్లు ఎగసి 9,500కు చేరువలో 9,490 వద్ద క్లోజ్ అయ్యింది . ఇక ఇంట్రాడే లో సెన్సెక్స్ 32,267 వద్ద గరిష్టాన్ని తాకగా.. 31,642 సమీపంలో కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ ఒక దశలో 9,511 పాయింట్ల వద్ద గరిష్టాన్ని అందుకోగా.. 9,337 దిగువకు చేరింది.

ఆర్ధిక వ్యవస్థ ఏడాది ద్వితీయార్థం నుండి గాడిలో పడుతుందన్నఅంచనాలతో జోష్
కరోనా లాక్ డౌన్ తో దెబ్బ తిన్న ఆర్ధిక వ్యవస్థ ఏడాది ద్వితీయార్థం నుంచీ గాడిలో పడతాయన్న అంచనాలు ప్రపంచస్థాయిలో ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు .ఇక అంతేకాకుండా మే నెల డెరివేటివ్ సిరీస్ చివరి రోజు సైతం ట్రేడర్లు షార్ట్ కవరింగ్ చేపట్టడంతో ఇండెక్సులు బేర్ ర్యాలీ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు దేశాలలో లాక్ డౌన్ ఎత్తివేస్తుండటం అన్ని వ్యాపారాలకు వెసులుబాటు కలుగుతుండటం కూడా మార్కెట్ కు బూస్ట్ ఇస్తుంది.

ఈ రోజు ట్రేడింగ్ ఆరంభం నుండి లాభాల బాటే
ఇక ఈ రోజు ఆరంభంనుంచి లాభాలతో మురిపించిన సూచీలురోజంతా అదే ధోరణిని కొనసాగించాయి. ముఖ్యంగా బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, మెటల్ సూచీలు 2-3 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా కనిపించాయి. అటు డాలరు మారకంలో రూపాయి బలహీనంగాముగిసింది.గత ముగింపు 75.72 తో పోలిస్తేగురువారం 75.75 వద్ద ముగిసింది.లాక్డౌన్ కాలంలో నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్లు నష్టాలను చవిచూడలేదని ఏస్ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి.

బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్ల ర్యాలీ .. టాప్ గెయినర్ ఐషర్ మోటార్స్
విచిత్రంగా ఈ సమయంలోనే ఊహించని విధంగా ఈ ఇండెక్స్లు చెప్పుకోదగిన ర్యాలీని చేశాయి. లాక్డౌన్ను విధించిన నాటి నుంచి నిన్నటి(మే 27) వరకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 9శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో వీటి బెంచ్మార్క్ ఇండెక్స్ 19శాతం పెరిగింది. ఇక ఫైనాన్షియల్ హెవీవెయిట్స్ హెచ్ డీఎఫ్సీ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్,కోటక్ మహీంద్రా,ఐసీఐసీఐ బ్యాంక్ ఈ రోజుట్రేడింగ్ లో భారీగా లాభపడ్డాయి.ఐషర్ మోటార్స్టాప్ గెయినర్ గా నిలిచింది . జీ, హీరో మోటోకార్ప్,ఎల్ అండ్ టీ,బ్రిటానియాకూడా లాభపడ్డాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్,ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా,హిందుస్తాన్ యూనిలీవర్,బీపీసీఎల్, ఐటీసీ,విప్రో, టీసీఎస్ లు నష్టపోయాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కోవిడ్ తర్వాత రికార్డు స్థాయికి ఇండియా VIX.. భారీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications