నెదర్లాండ్కు చెందిన మొబిలిటీ టెక్నాలజీ కంపెనీ స్టెల్లాంటిస్ 2024 నాటికి హైదరాబాద్ టెక్ కేంద్రంలో 2200 మంది నిపుణులను నియమించుకోవాలని భావిస్తోంది. వాహనదారులు తమ కార్లతో మరింతగా కనెక్ట్ కావడానికి కొత్తతరం టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ను అభివృద్ధి చేయడంలో కంపెనీ నిమగ్నమై ఉందని హైదరాబాద్ కేంద్రంలో AI, సాఫ్టువేర్ ఇంజనీరింగ్ పన దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు సైలాంటిస్ సాఫ్టువేర్ బిజినెస్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ హెడ్ మమతా చామర్తి తెలిపారు.
హైదరాబాదులో లభ్యమయ్యే నిపుణుల నుండి కంపెనీ ప్రయోజనం పొందనుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంలో 500 మంది పని చేస్తున్నారని, 2024 నాటికి కొత్తగా 2,200 మంది నిపుణులను ఐటీ, సాఫ్టువేర్ విభాగాల్లో నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. 2030 నాటికి 20 బిలియన్ యూరోల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యాన్ని చేరడానికి హైదరాబాద్ కేంద్రం దోహదపడుతుందన్నారు.

కంపెనీకి చెన్నై, పుణెలో ఇంజనీరింగ్ కేంద్రాలు ఉన్నాయి. సాఫ్టువేర్ ఆధారిత ప్రోడక్ట్స్ను అందించడం వంటి వాటి ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. బీఎండబ్ల్యూ, ఫాక్స్కాన్ వంటి కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారా పార్కింగ్ సేవలను అందించనుంది. ప్రస్తుతం ఐటీ డివిజన్లో 500 మంది ఉద్యోగులు ఉండగా, త్వరలో 1200 మంది చేరనున్నారని మమత తెలిపారు.2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4500 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంటామని వెల్లడించారు. ఇందులో అత్యధిక భాగం భారత్దే అన్నారు.
2026 నాటికి 4 బిలియన్ యూరోల వ్యాపారానికి, 2030 నాటికి 20 బిలియన్ యూరోలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 380 మిలియన్ యూరోల వార్షిక రెవన్యూ ఉంది. 2025 నాటికి సాఫ్టువేర్, ఎలక్ట్రిషన్ ట్రాన్సాఫార్మేషన్ కోసం 30 బిలియన్ యూరోల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications