స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు, బలహీనపడిన రూపాయి

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 7) నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 19.65 పాయింట్లు(0.05 శాతం) లాభపడి 38,376 వద్ద, నిఫ్టీ 17.20 పాయింట్లు(0.15 శాతం) ఎగిసి 11,351 వద్ద ప్రారంభమైంది. కాసేపట్లోనే సెన్సెక్స్ 100 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆద్యంతం పెద్దగా తేడా లేకుండా స్వల్ప లాభాల్లోనే ట్రేడ్ అయింది. చివరకు సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 38,417.23 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు ఎగిసి 11,355 పాయింట్ల వద్ద ముగిసింది. 1212 షేర్లు లాభాల్లో, 1461 షేర్లు నష్టాల్లో ముగియగా, 187 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఇన్ఫ్రా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, గెయిల్ ఉన్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్ 6 శాతం వరకు లాభపడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతుండటం వంటి అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపించాయి. డాలర్ మారకంతో రూపాయి 73.34 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడింది.

Sensex, Nifty end in the green amid high volatility

ఈ రోజు వొడాఫోన్ ఐడియా నుండి కీలక ప్రకటన రానుందనే వార్తల నేపథ్యంలో షేర్ ధర ఉదయం భారీగా పెరిగింది. పెట్టుబడుల గురించి ప్రకటన వస్తుందని భావించారు. దీంతో ఓ సమయంలో 13 శాతం లాభపడింది. బ్రాండ్ పేరుపై ప్రకటన చేయడంతో షేర్ ధర రెండు శాతం కిందకు పడిపోయింది. ఆ తర్వాత టారిఫ్ పెంచుదామని ప్రకటన చేయడంతో మళ్లీ కాస్త పుంజుకుంది. చివరకు 2.90 శాతం లాభంతో రూ.12.40 వద్ద క్లోజ్ అయింది. అమెజాన్, వెరిజాన్‌లు పెట్టుబడులు పెట్టే అవకాశముంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+