ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 7) నష్టాలతో ప్రారంభమై లాభాల్లో ముగిశాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 19.65 పాయింట్లు(0.05 శాతం) లాభపడి 38,376 వద్ద, నిఫ్టీ 17.20 పాయింట్లు(0.15 శాతం) ఎగిసి 11,351 వద్ద ప్రారంభమైంది. కాసేపట్లోనే సెన్సెక్స్ 100 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆద్యంతం పెద్దగా తేడా లేకుండా స్వల్ప లాభాల్లోనే ట్రేడ్ అయింది. చివరకు సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి 38,417.23 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు ఎగిసి 11,355 పాయింట్ల వద్ద ముగిసింది. 1212 షేర్లు లాభాల్లో, 1461 షేర్లు నష్టాల్లో ముగియగా, 187 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఇన్ఫ్రా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్యూఎల్, టీసీఎస్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, గెయిల్ ఉన్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్ 6 శాతం వరకు లాభపడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతుండటం వంటి అంశాలు మార్కెట్ పైన ప్రభావం చూపించాయి. డాలర్ మారకంతో రూపాయి 73.34 వద్ద క్లోజ్ అయింది. క్రితం సెషన్తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీనపడింది.

ఈ రోజు వొడాఫోన్ ఐడియా నుండి కీలక ప్రకటన రానుందనే వార్తల నేపథ్యంలో షేర్ ధర ఉదయం భారీగా పెరిగింది. పెట్టుబడుల గురించి ప్రకటన వస్తుందని భావించారు. దీంతో ఓ సమయంలో 13 శాతం లాభపడింది. బ్రాండ్ పేరుపై ప్రకటన చేయడంతో షేర్ ధర రెండు శాతం కిందకు పడిపోయింది. ఆ తర్వాత టారిఫ్ పెంచుదామని ప్రకటన చేయడంతో మళ్లీ కాస్త పుంజుకుంది. చివరకు 2.90 శాతం లాభంతో రూ.12.40 వద్ద క్లోజ్ అయింది. అమెజాన్, వెరిజాన్లు పెట్టుబడులు పెట్టే అవకాశముంది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications