స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగిశాయి. ఈ వారం అంతా సూచీలు దుమ్ము రేపుతున్నాయి. సోమవారం లాభాల్లో ముగిసిన సూచీలు, మంగళ, బుధవారాలు భారీగా లాభపడ్డాయి. నేడు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ మూడు రోజుల్లో 2000 పాయింట్లు లాభపడింది. నేడు సూచీలు ప్రారంభంలో కాస్త ఒడిదుడుకుల్లో లోనైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత భారీగా పుంజుకున్నాయి. దీంతో నేడు సెన్సెక్స్ 123 పాయింట్లు లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు డీలాపడినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, HDFC బ్యాంకు, ఎయిర్టెల్, టాటా స్టీల్ వంటి స్టాక్స్ సూచీల పరుగుకు కారణమయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 74.17గా ఉంది.
సెన్సెక్స్ 54,576.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,717.24 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,230.89 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,288.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,349.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,210.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 123.07 (0.23%) పాయింట్లు లాభపడి 54,492.84 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35.80 (0.22%) పాయింట్లు ఎగిసి 16,294.60 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 54,700 పాయింట్లు క్రాస్ చేసింది. తద్వారా 55,000 పాయింట్ల దిశగా పరుగులు పెడుతోంది. నిఫ్టీ 16,350 పాయింట్ల దరిదాపుకు చేరుకొని, చివరకు 16,295 పాయింట్ల వద్ద ముగిసింది.

ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులు ఎదుర్కొంది. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టాలు నమోదు చేశాయి. ఐటీ, మెటల్స్, మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఎయిర్టెల్ స్టాక్ నాలుగు శాతానికి పైగా లాభపడింది.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications