GDP డేటాకు ముందు అదరగొట్టిన మార్కెట్లు: సెన్సెక్స్ 57,500 పైకి

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్ 31) అదరగొట్టాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత అంతకంతకూ పైకి చేరుకుంది. సెన్సెక్స్ చరిత్రలో మొదటిసారి 57,000 పాయింట్లను దాటింది. క్లోజింగ్ సమయానికి 600 పాయింట్లకు పైగా లాభపడి 57,500 పాయింట్లు క్రాస్ చేసింది. నేడు జీడీపీ డేటా విడుదల కానుంది. 2021 క్యాలెండర్ ఏడాది మొదటి అర్ధ సంవత్సరం లేదా FY21 మొదటి త్రైమాసికం జీడీపీ డేటా సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు జోరు మీద ఉన్నాయి.

30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ కేవలం ఆగస్ట్ నెలలోనే 4000 పాయింట్లు లాభపడి 57,000 పాయింట్లను మొదటిసారి క్రాస్ చేసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఉదయం సెషన్ సమయానికే ఆల్ టైమ్ గరిష్టం రూ.2,48,34,296 కోట్లకు చేరుకుంది.

సెన్సెక్స్ ఆగస్ట్ 4వ తేదీన మొదటిసారి 54,000 మార్కును దాటింది. ఆ తర్వాత 9 సెషన్‌లలోనే అంటే ఆగస్ట్ 13వ తేదీన 55,000 మార్కును చేరింది. తర్వాత వారం రోజుల్లోపే 56,000 మార్కును దాటిన సెన్సెక్స్, నేడు (ఆగస్ట్ 31) 57,000 మార్కు పైన నిలబడింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.85 శాతం లాభపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా స్టీల్ వరుసగా 2.3 శాతం, 0.92 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 56,995.15 పాయింట్ల వద్ద ప్రారంభమై 57,514.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,859.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,947.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,153.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,915.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 662.63 (1.16%) పాయింట్లు లాభపడి 57,552.39 పాయింట్ల వద్ద, నిఫ్టీ 201.15 (1.19%) పాయింట్లు లాభపడి 17,132.20 పాయింట్ల వద్ద ముగిసింది.

Sensex breaches 57,000 mark for first time ahead of GDP data release

భారతీ ఎయిర్ టెల్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. మెటల్, పవర్ స్టాక్స్ అదరగొట్టాయి. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్టెల్ 7.39 శాతం, ఐచర్ మోటార్స్ 4.94 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.43 శాతం, హిండాల్కో 3.73 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 3.56 శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ ఓ వైపు అదరగొట్టగా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు షేర్లు 5.5 శాతం నష్టపోయాయి. ఆగస్ట్ నెలలో సెన్సెక్స్ 8.2 శాతం మేర ఎగిసిపడింది. నిఫ్టీ 17,100 పాయింట్లు దాటింది.

సెన్సెక్స్ 30 షేర్లలో 26 రాణించాయి. నాలుగు నష్టపోయాయి. నెస్లే ఇండియా 0.29 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.21, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.18, పవర్ గ్రిడ్‌ 0.85 శాతం చొప్పున నష్టపోయాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ సోమవారం 29 పైసలు పెరిగి 73.00 వద్ద ముగిసింది. గత మూడు ట్రేడింగ్ సెషన్‌లలో రూపాయి మారకపు విలువ రూ.1.24 మేర పెరగడం గమనార్హం. సూచీలు పరుగు పెట్టడానికి ఇది కూడా కారణం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+