స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఆగస్ట్ 3) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న భారీగా లాభపడిన సూచీలు నేడు అంతకుమించిన ఉత్సాహంతో పరుగులు పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండడం అంతర్జాతీయ సూచీలను కలవరానికి గురి చేస్తోంది. అమెరికా మార్కెట్లు సోమవారం అప్రమత్తంగా కదిలాయి. ఈ రోజు ఆసియా మార్కెట్లు అలాగే ఉన్నాయి.
అయితే త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండడం, తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం భారత మార్కెట్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయానికి 240 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మధ్యాహ్నానికి దాదాపు 500 పాయింట్లకు పైగా ఎగిసింది.

వరుసగా రెండో రోజు భారీ జంప్
సెన్సెక్స్ ఉదయం 53,125.97 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,486.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,088.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ +565.49 (1.07%) పాయింట్లు లాభపడి 53,516.41 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా సరికొత్త రికార్డును తాకింది. ఉదయం 15,951.55 పాయింట్ల వద్ద ప్రారంభమై నిఫ్టీ, 16,026.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,914.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
మధ్యాహ్నం గం.1 సమయానికి నిఫ్టీ 151.45 (0.95%) పాయింట్లు లాభపడి 16,036.60 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిన్న కూడా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిన్న సెన్సెక్స్ 363.79 (0.69%) పాయింట్లు ఎగిసి 52,950.63 పాయింట్ల వద్ద, నిఫ్టీ 122.10 (0.77%) పాయింట్లు ఎగిసి 15,885.15 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.33 వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
మధ్యాహ్నం సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 3.84 శాతం, HDFC 3.33 శాతం, సన్ ఫార్మా 2.93 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.33 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.17 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 1.00 శాతం, గ్రాసీమ్ 0.99 శాతం, జెఎస్డబ్ల్యు స్టీల్ 0.82 శాతం, బజాజ్ ఆటో 0.76 శాతం, ఓఎన్జీసీ 0.60 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో HDFC, SBI, TCS, సన ఫార్మా, టాటా స్టీల్ ఉన్నయి.

ఇండియన్ రైల్వేస్ స్టాక్
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) నిన్న ఏడు శాతం ఎగబాకి రూ.2,490తో సరికొత్త గరిష్టానికి చేరుకుంది. నేడు మాత్రం ఈ స్టాక్ దాదాపు నాలుగు శాతం మేర క్షీణించి రూ.2,465.00 వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ స్ప్లిట్ ప్లాన్ నేపథ్యంలో నిన్న స్టాక్ లాభపడింది. ఈ స్టాక్ జూలై 20, 2021 నాడు రూ.2,479.45తో సరికొత్త గరిష్టాన్ని తాకింది. నిన్న ఈ మార్కును దాటింది. నిన్న 2500 దిశగా కనిపించినప్పటికీ రూ.10 దూరంలో నిలిచింది. నేడు మాత్రం కాస్త క్షీణించింది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications