ముంబై: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాటపట్టిన ప్రభావం మార్కెట్పై పడుతున్నట్టే కనిపిస్తోంది. షేర్ మార్కెట్ ఇవ్వాళ ఒకింత నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ.. ఈ రెండు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ట్రేడింగ్ నమోదు చేసుకోలేదు. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్.. ఫ్లాట్గా ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా నష్టపోయాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్కు ట్రేడ్ మార్క్గా ఉంటూ వస్తోన్న కొన్ని సెగ్మెంట్స్కు చెందిన షేర్ల ధరలు నిరాశ పరుస్తున్నాయి. ఇంట్రా డే ట్రేడింగ్ పెద్దగా ఆశించదగ్గ విధంగా కొనసాగలేదు.

నష్టాలతో ఆరంభం.. నష్టాలతో ముగింపు..
సెన్సెక్స్ 180 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. నిఫ్టీ కూడా తన బెంచ్మార్క్ 17 వేల పాయింట్లకు దిగువగా ట్రేడింగ్ను నమోదు చేసుకుంది. ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు అత్యధికంగా తొలి గంటలో నష్టపోయాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఫార్మాసూటికల్స్ సెగ్మెంట్స్కు సంబంధించిన షేర్లు కొంత నష్టాలతో మొదలయ్యాయి. ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు.. బుధవారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్తో పోల్చి చూస్తే మూడుశాతం మేర నష్టాన్ని చవి చూశాయి.

క్లోజింగ్ అవర్లోనూ..
ఓపెనింగ్ అవర్లో ఎలాంటి పరిస్థితులు కనిపించాయో.. క్లోజింగ్లోనూ అదే తీరు నెలకొంది. 180 పాయింట్ల నష్టంతో ఆరంభమైన సెన్సెక్స్.. కొంత బెటర్గా పెర్ఫార్మ్ చేయగలిగింది. తన నష్టాన్ని తగ్గించుకోలిగింది. అంతే తప్ప లాభాల్లోకి ట్రేడ్ కాలేకపోయింది. ఈ ఉదయం 57.882.91 పాయింట్ల వద్ద ఆరంభమైన సెన్సెక్స్ 0.021 శాతంతో 12.17 పాయింట్ల మేర నష్టపోయింది. 57,885.94 పాయింట్ల వద్ద ముగిసింది.

కొంత పుంజుకొన్నా..
రెండో గంటలో సెన్సెక్స్ పాయింట్లు దూసుకెళ్లాయి. 10:25 నిమిషాలకు గరిష్ఠంగా 57,989.78 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తరువాత మళ్లీ క్షీణించింది. అత్యల్పంగా 57,802.09 పాయింట్లకు దిగజారింది. చివరి అరగంటలో కొంత పుంజుకోగలిగింది. నిఫ్టీ పరిస్థితి దాదాపు ఇంతే. నిఫ్టీ 50 9.65 పాయింట్ల మేర నష్టపోయింది. 17,203 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఈ రెండూ స్వల్పంగా నష్టపోయినందున.. మార్కెట్ వర్గాలు దీన్ని ఫ్లాట్ ట్రేడింగ్గా భావిస్తున్నాయి.

నిఫ్టీ 50లో
నిఫ్టీ 50లో హెచ్సీఎల్ టెక్నాలజీస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఆయా కంపెనీలకు చెందిన షేర్లు రెండు శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జెఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, టాటా స్టీల్ టాప్ లూజర్స్గా నిలిచాయి. వాటి షేర్లు రెండు శాతం వరకు నష్టపోయాయి.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications