ఐపీఓల తర్వాత స్టాక్ ల లిస్టింగ్ విషయంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం కీలక ప్రతిపాదన చేసింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (IPO) ముగిసిన తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజీలలో షేర్ల లిస్టింగ్కు పట్టే సమయాన్ని ప్రస్తుతం ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గించాలని ప్రతిపాదంచింది. ఈ ప్రతిపాదన షేర్ల లిస్టింగ్, ట్రేడింగ్ కోసం టైమ్లైన్లలో ప్రతిపాదిత తగ్గింపు జారీదారులతో పాటు పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.
"ఇష్యూదారులు సేకరించిన నిధఉలు త్వరగా పొందడం, తద్వారా వ్యాపారం చేయడం సులభతరం అవుతుంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడికి ముందస్తు క్రెడిట్, లిక్విడిటీని కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది" అని సెబీ తన కన్సల్టేషన్ పేపర్లో పేర్కొంది. మార్కెట్స్ రెగ్యులేటర్, నవంబర్ 2018లో, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)ని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం బ్లాక్ చేసిన మొత్తం (ASBA) ద్వారా సపోర్టు చేసే అప్లికేషన్తో అదనపు చెల్లింపు విధానంగా పరిచయం చేసింది. ఇష్యూ ముగిసిన ఆరు రోజులలోపు లిస్టింగ్ కోసం టైమ్లైన్లను సూచించింది.

ఐపీఓ ప్రక్రియను సులభం చేసేందుకు సెబీ పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. సెబీ తన కన్సల్టేషన్ పేపర్లో, ఇష్యూ మూసివేసిన తేదీ నుండి పబ్లిక్ ఇష్యూల ద్వారా షేర్లను లిస్టింగ్ తేదీ వరకు ప్రస్తుత ఆరు రోజుల నుండి మూడు రోజులకు (T+3) తగ్గించాలని సూచించడం మంచి పరిణామమని పలువులు అభిప్రాయపడుతున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఈ ప్రతిపాదనపై జూన్ 3 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది.
మరోవైపు మ్యూచవల్ ఫండ్స్ ఏఎంసీలు అంతర్గత నిఘా ఏర్పాటు చేసుకోవాలని సెబీ సూచించింది. ఇలా చేయడం వల్ల మోసాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. గతంలో ఎల్ఐసీ, యాక్సిస్ ఏఎంసీల్లో ఫ్రంట్ లైన్ ట్రోడ్ లు జరిగాయి. దీంతో సెబీ ఏఎంసీలను అంతర్గత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీనిపై కూడా జూన్ 3 వరకు అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరంది.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications