2008లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకుల సమాఖ్య ఉమ్మడిగా నెలకొల్పిన నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గుత్తాధిపత్యం దిశగా సాగుతోంది. దీన్ని అంగీకరించలేని బ్యాంకులు ఇప్పటికే మౌనంగానే ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా రిటైల్ చెల్లింపుల విషయంలో బ్యాంకులకు దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని భావిస్తున్నాయి. దీంతో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) స్ధానంలో కొత్తగా మరో రిటైల్ టెల్లింపుల వ్యవస్ధను నెలకొల్పడం ద్వారా దీని గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్బీఐ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు రిటైల్ చెల్లింపుల సేవలు అందిస్తున్న ఎన్పీసీఐ మొత్తంగా 60 శాతం లావాదేవీలను నియంత్రిస్తోంది. ఇందులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ), తక్షణ చెల్లింపు సేవలు (ఐఎంపిఎస్), భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) తో పాటు మరికొన్ని సేవలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో శరవేరంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల విభాగంలో తానే నేరుగా ప్రవేశించాలని భావిస్తున్న ఎస్బీఐ.. తద్వారా ఎన్పీసీఐ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీఐకి దరఖాస్తు కూడా చేసుకుంది. రూ.500 కోట్ల రూపాయలు నికర పెట్టుబడితో ఈ సంస్ధను ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో ఎస్బీఐ ఈ మేరకు లాంఛనాలు పూర్తి చేస్తోంది.

తాము కొత్తగా ఏర్పాటు చేసే కొత్త డిజిటల్ పేమెంట్స్ సంస్ధలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులను కూడా ఎస్బీఐ ఆహ్వానిస్తోంది. తాను ప్రధాన ప్రమోటర్గా ఉంటూ మిగిలిన వారితో కలిసి కన్సార్టియం ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తులకు 2021 జనవరి వరకూ గడువు ఉండటంతో ఆ లోపు ఈ ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. ఎస్బీఐ కొత్త డిజిటల్ పేమెంట్స్ సంస్ధ ప్రారంభమైతే ఇక ఎన్సీపీఐతో పాటు అందులో భాగస్వాములుగా ఉన్న బ్యాంకులకూ చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications