2008లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకుల సమాఖ్య ఉమ్మడిగా నెలకొల్పిన నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గుత్తాధిపత్యం దిశగా సాగుతోంది. దీన్ని అంగీకరించలేని బ్యాంకులు ఇప్పటికే మౌనంగానే ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా రిటైల్ చెల్లింపుల విషయంలో బ్యాంకులకు దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని భావిస్తున్నాయి. దీంతో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) స్ధానంలో కొత్తగా మరో రిటైల్ టెల్లింపుల వ్యవస్ధను నెలకొల్పడం ద్వారా దీని గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమవుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్బీఐ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు రిటైల్ చెల్లింపుల సేవలు అందిస్తున్న ఎన్పీసీఐ మొత్తంగా 60 శాతం లావాదేవీలను నియంత్రిస్తోంది. ఇందులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపీఐ), తక్షణ చెల్లింపు సేవలు (ఐఎంపిఎస్), భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) తో పాటు మరికొన్ని సేవలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో శరవేరంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల విభాగంలో తానే నేరుగా ప్రవేశించాలని భావిస్తున్న ఎస్బీఐ.. తద్వారా ఎన్పీసీఐ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీఐకి దరఖాస్తు కూడా చేసుకుంది. రూ.500 కోట్ల రూపాయలు నికర పెట్టుబడితో ఈ సంస్ధను ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో ఎస్బీఐ ఈ మేరకు లాంఛనాలు పూర్తి చేస్తోంది.

తాము కొత్తగా ఏర్పాటు చేసే కొత్త డిజిటల్ పేమెంట్స్ సంస్ధలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులను కూడా ఎస్బీఐ ఆహ్వానిస్తోంది. తాను ప్రధాన ప్రమోటర్గా ఉంటూ మిగిలిన వారితో కలిసి కన్సార్టియం ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తులకు 2021 జనవరి వరకూ గడువు ఉండటంతో ఆ లోపు ఈ ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. ఎస్బీఐ కొత్త డిజిటల్ పేమెంట్స్ సంస్ధ ప్రారంభమైతే ఇక ఎన్సీపీఐతో పాటు అందులో భాగస్వాములుగా ఉన్న బ్యాంకులకూ చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications