Samsung: శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ కు, దాని కార్మికులకు మధ్య చెలరేగిన గందరగోళం ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఇరు పార్టీలు వేతన పెంపుపై ఓ అంగీకారానికి వచ్చారు. ఏడాదికి సగటున 4.1 శాతం మేర హైక్ కు మేనేజ్ మెంట్ ఓకే చెప్పింది. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ ల లభ్యత, మందగమనం సహా కంపెనీ పేలవ పనితీరు వల్ల బోర్డు సభ్యులకు మాత్రం ఈసారి మొండిచేయి చూపింది.
గత ఏడాది తన ఉద్యోగులకు శామ్ సంగ్ ఇచ్చిన వేతన పెంపుతో పోలిస్తే ఈ దఫా హైక్ ఏమాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని కంపెనీ సిబ్బంది వాపోతున్నారు. ఇంతకు ముందు సంవత్సరం 9 శాతం జీతాలను పెంచగా.. ఇప్పుడు 4.1కే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 9 శాతం అనేది దశాబ్దంలోనే అత్యధికం అని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్స్ మరియు స్మార్ట్ ఫోన్ తయారీదారుగా పేరుగాంచిన శామ్ సంగ్.. వేతనాలు సహా ఇతర లేబర్ పాలసీలపై ఉద్యోగుల ప్రతినిధులతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. గర్భిణీలకు పని గంటలను పొడిగించడం ఇందులో ముఖ్య నిర్ణయమని పేర్కొంది. అయితే ఈ ప్రకటనలు కంపెనీ అంతర్గతంగా జరిగినట్లు వెల్లడించింది.
మొదటి త్రైమాసికంలో లాభం దాదాపు 96 శాతం పడిపోవడానికి కారణాలను పరిగణనలోకి తీసుకుని కంపెనీతో పాటు ఉద్యోగులు రాజీ కుదుర్చుకున్నాయి. తద్వారా బోర్డు సభ్యులకు 17 శాతం వేతన పరిమితిని పెంచాలనే సంస్థ ప్రారంభ ప్రణాళిక నిలిపివేసింది. గత సంవత్సరం వేతన విధానాన్నే వర్తింపజేయాలని యాజమాన్యం నిర్ణయించింది. మొత్తం మీద ఇప్పటి వరకు 10 రౌండ్ల చర్చలు జరిపికే కానీ ఇరు పార్టీల మధ్య విభేదాలు సద్దుమణగలేదు.


Click it and Unblock the Notifications