ట్రంప్ సుంకాల దాడి వేళ భారత్‌కు రష్యా బంపరాఫర్..షాక్‌లో అమెరికా అధ్యక్షుడు

Russia Counters Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై కఠినమైన పదజాలంతో విరుచుకుపడిన సంగతి విదితమే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై భారీ సుంకాలు విధిస్తూ దూకుడుగా వెళుతున్నారు. భారత్ కూడా ధీటుగానే బదులిస్తూ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో భారత్-రష్యా సంబంధాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపడం లేదు.ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విస్తరిస్తూ, మరింత బలపడుతున్నాయి.

ఒకప్పుడు రష్యా-భారత్ సంబంధాలు కేవలం సైనిక సహకారానికి మాత్రమే పరిమితమై ఉన్నాయనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రెండు దేశాల మధ్య బంధం రోజురోజుకీ బలపడుతూ, నమ్మకానికి ప్రతీకగా మారుతోంది. ఈ విషయాన్ని రష్యా సీనియర్ దౌత్యవేత్త.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బాబుష్కిన్ బహిరంగంగానే వెల్లడించారు.ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న రష్యా చార్జ్ డి'అఫైర్స్ రొమన్ బాబుష్కిన్ మా మార్కెట్లు భారత ఉత్పత్తులకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఇక ప్రారంభిద్దాం... శ్రీగణేశుడే ప్రారంభిస్తున్నాడు అంటూ విలేకరులను ఉద్దేశించి ఆయన తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించారు. ఈ చిన్న వాక్యం ద్వారా భారత్‌ సంస్కృతిపై తనకు ఉన్న గౌరవాన్ని ఆయన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. భారత ఉత్పత్తులకు మా మార్కెట్లు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి. రష్యా-భారత్ సంబంధాల పునాది పరస్పర విశ్వాసంతో కూడుకున్నవని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

Trump India trade Russia diplomat India India open markets Trump tariffs India India Russia ties Trump trade war India Russia US relations India economy open Russia rebuts Trump Trump India diplomacy Indian markets open statement Trump Russia India relations - Russia Counters Trump

మిత్రులను కూడా అవమానించడంలో ట్రంప్ వెనుకాడడంలేదు. భారత్ రష్యా నుంచి చమురు కొంటే దానిలో తప్పేముంది? దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు నేరుగా అమెరికాకు గట్టి షాక్ ఇచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు. రష్యా-భారత్ బంధం కేవలం వ్యాపార పరంగానే కాకుండా, రాజకీయ స్థాయిలో కూడా పెరుగుతోందని బాబుష్కిన్ సంకేతాలిచ్చారు.

ముఖ్యంగా రష్యా-ఇండియా-చైనా (RIC) మద్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని.. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి సవాలు విసరడానికి ఈ మూడు దేశాలు కలిసే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక చమురు విషయానికి వస్తే.. మరో కీలక విషయం వెలుగులోకివచ్చింది. రష్యా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఎవ్‌గెనీ గ్రీవా వెల్లడించిన ప్రకారం.. భారత్‌ రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు 5 శాతం తగ్గింపు ఇస్తున్నారు ఇది ఒక వాణిజ్య రహస్యం అయినప్పటికీ.. ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది.

ప్రపంచ దేశాల నుంచి ఇండియా ప్రతీ ఏడాది సుమారు 250 మిలియన్ టన్నుల చమురు దిగుమతి చేసుకుంటుంది. అందులో 40 శాతం వరకు రష్యానే సరఫరా చేస్తోంది. ఈ సరఫరాలో ప్రతి బ్యారెల్‌పై 5 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నామని గ్రీవా తెలిపారు. దీంతో పాటుగా చమురు వ్యాపారంలో వచ్చే షిప్పింగ్, బీమా సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశామని గ్రీవా తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, పశ్చిమ దేశాలు రష్యాపై ఎన్నో ఆంక్షలు విధించాయి. ఆ సమయంలో కూడా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగించింది. ఇది వారికి నచ్చడం లేదు. అయితే తాజాగా రష్యా మాత్రం భారత్‌కు ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చి తన మైత్రిని మరింత బలపరచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+