రూపాయి మరింత పతనం, వరుసగా 4 సెషన్‌లలో డౌన్

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ గురువారం నాటితో (8-ఏప్రిల్-2021) వరుసగా నాలుగు సెషన్‌లలో నష్టపోయింది. నిన్న రూపాయి 11 పైసలు క్షీణించి 74.58 వద్ద ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో రూపాయి బలహీనపడింది. డొమెస్టిక్ యూనిట్ ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో 74.38 వద్ద ప్రారంభమైన రూపాయి, రోజంతా 74.19 నుండి 74.93 మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌‌లో 74.47 వద్ద క్లోజ్ కాగా, నిన్న 11 పైసలు క్షీణించింది.

దేశీయ కరెన్సీ రూపాయి అంతకుముందు రోజు (ఏప్రిల్ 7) భారీగా పతనమైంది. డాలర్ మారకంతో బుధవారం ఒక్కరోజే 105 పైసలు క్షీణించింది. గత 20 నెలల ఇంతస్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఆ రోజు ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్ మారకంతో 74.47కు పడిపోయింది. 2019 ఆగస్ట్ తర్వాత ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. నాడు ఆగస్ట్ 5న (2019) రూపాయి చరిత్రలో భారీ నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది నవంబర్ 13వ తేదీ తర్వాత ఇది కనిష్ట ముగింపు.

Rupee edges lower to 74.58 against dollar, falls For 4th Straight Session

బుధవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 73.52 వద్ద ప్రారంభమై ఆ స్థాయి నుండి 74.50 పరిధిలో ట్రేడ్ అయింది. చివరికి 105 పైసల నష్టంతో 74.47 వద్ద ముగిసింది. ఆర్బీఐ రెపోరేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఇటీవల చారిత్రక గరిష్ఠస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఆర్థిక రికవరీపై అస్థిరత కనిపిస్తుందనే వ్యాఖ్యలు రూపాయిపై ప్రభావం చూపాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+