కరోనా మహమ్మారిపై పోరుకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, సంస్థల యజమానుల చేతుల్లో చేతుల్లో డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో నిన్న ఎస్ఎంఎస్ఈలకు రూ.3 లక్షల కోట్ల సహా మొత్తం రూ.6 లక్షల కోట్లను ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి.

రూ.6 లక్షలు కాదు.. ఇప్పటికే రూ.13 లక్షల కోట్ల ప్రకటన
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో నిన్న రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ.. ఇప్పటికే దాదాపు రూ.13 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు అయింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో రూ.7 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. నిన్న ఎస్ఎంఎస్ఈలకు రూ.3 లక్షలు, మిగతా వాటికి రూ.3 లక్షలు ప్రకటించినందున మరో రూ.14 లక్షల కోట్లు ప్రకటిస్తారని భావిస్తుండవచ్చు. కానీ రూ.7 లక్షల కోట్ల వరకు ప్యాకేజీని గతంలో ప్రకటించారు.

ఇప్పటి వరకు ప్రకటించింది
కరోన మహమ్మారిపై పోరు కోసం నిర్మలా సీతారామన్ మార్చి నెలలో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో 80 కోట్ల మంది పేదలకు నేరుగా జన్ ధన్ అకౌంట్లలో వేసే నగదు లబ్ధి లేదా రేషన్ ప్రయోజనం వంటివి ఉన్నాయి. ఇది గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందుతోంది. ఆర్థిక వ్యవస్థలోకి మనీ ఇన్ఫ్యూజ్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా ఆర్బీఐ ఇప్పటికే రూ.5.24 లక్షల కోట్లు ప్రకటించింది. ఈ రెండు కలుపుకుంటే దాదాపు రూ.7 లక్షల కోట్లు గతంలో ప్రకటించారు. నిన్న నిర్మల రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. అంటే మొత్తం ప్యాకేజీ ప్రకటన రూ.12.88 లక్షల కోట్లకు చేరుకుంది. మరో రూ.7.12 లక్షల కోట్లకు సంబంధించిన ప్రకటన చేయాల్సి ఉంది.

జీడీపీలో 10 శాతం
రూ.20 లక్షల ప్యాకేజీ జీడీపీలో 10 శాతం ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన ప్యాకేజీతో కోట్లాది మంది ఉద్యోగులకు, పేదలకు, 45 లక్షల చిన్న వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్, డిస్కం.. ఇలా ఎంతో మందికి లేదా ఎన్నో రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం చెబుతోంది. అయితే ఈ ప్యాకేజీపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తొలుత ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్లు జీడీపీలో 0.8 శాతం, ఆర్బీఐ ప్రకటించిన మొత్తం జీడీపీలో రూ.3.2 శాతం. గతంలో చేసిన ప్రకటనలు జీడీపీలో 4 శాతం వరకు ఉన్నాయి. మొత్తం రూ.20 లక్షల కోట్లు జీడీపీలో 10 శాతం.

ప్రపంచ అతిపెద్ద ఉద్దీపనల్లో ఒకటి
రూ.20 లక్షల కోట్ల కోవిడ్ రిలీఫ్ ప్యాకేజీ ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్దీపనల్లో ఒకటి. అమెరికా తమ దేశ జీడీపీలో 13 శాతం, జపాన్ తమ దేశ జీడీపీలో 21 శాతం ఉద్దీపనలు ప్రకటించింది. ఆ తర్వాత ఇండియా జీడీపీలో 10 శాతం ప్రకటించింది.

ఆ రోజే రూ.2 లక్షల కోట్లు
రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన సమయంలోనే ఎమర్జెన్సీ హెల్త్ రెస్పాన్స్ ప్యాకేజీగా రూ.15,000 కోట్లు ప్రకటించింది. ఇన్కం ట్యాక్స్ రీఫండ్ పెండింగ్ మొత్తం రూ.18,000 కోట్లు. అంటే నిర్మల మార్చిలో ప్రకటన చేసిన సమయంలోనే రూ.2,03,000 ప్యాకేజీ వచ్చింది. ఈ లెక్కన రూ.13.21 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినట్లు అవుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications