8 ఏళ్ల గరిష్టానికి ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్భణం, 7.79% నమోదు
భారత రిటైల్ ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో అంచనాల కంటే పడిపోయి, భారీగా తగ్గింది. ఇంధనం, వంట నూనెలు సహా ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్భణం 7.79 శాతంగా నమోదయింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్టం. 2014లో నమోదైన 8.33 శాతం తర్వాత ఇదే అత్యధికం. 2021 ఏప్రిల్ నెలలో ఇది 4.23 శాతం మాత్రమే. ఆర్బీఐ నిర్దేశించుకున్న టార్గెట్ 2 శాతం నుండి 6 శాతం శ్రేణిలో గరిష్టస్థాయికి మించి ఈ ఏడాది జనవరి నుండి రిటైల్ ద్రవ్యోల్భణం నమోదవుతోంది.
అందుకే ద్రవ్యోల్భణం కట్టడి కోసం ఇప్పటికే కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్ నెలలో ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్భణం (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్భణం ఈ ఏడాది మార్చి నెలలో 6.95, ఫిబ్రవరి నెలలో 6.07 శాతం, జనవరిలో 6.01 శాతంగా నమోదయింది.
ఆహార పదార్థాల ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 8.38 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో ఇది 7.68 శాతం కాగా, 2021 ఏప్రిల్ నెలలో 1.96 శాతం. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్భణ రేటు మార్చి నెలలో 7.52 శాతం నుండి ఏప్రిల్ నెలలో 10.80 శాతానికి పేరిగింది. నూనెలు, ఫ్యాట్ విభాగాల్లో ధరలు 17.28 శాతం పెరిగాయి.