చైనాకు చెందిన మొబైల్ ఫోన్ తయారీ సంస్థ రియల్మి భారత మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను తీసుకు రాబోతోంది. వివిధ రకాల స్మార్ట్ టీవీలతో పాటు ఫిట్నెస్ బ్యాండ్ సహా అనేక ఉత్పత్తులను పరిచయం చేయనుంది. ఈ మేరకు సంస్థ సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు. 2020 ఏడాదిలోనే వీటిని ప్రారంభించాలని యోచిస్తోంది రియల్మి.

రియల్మి స్మార్ట్ టీవీలు, ఫిట్నెస్ బ్యాండ్
రియల్మి స్మార్ట్ టీవీలు 2వ క్వార్టర్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్ నెలలో కూడా అవకాశం ఉందని చెప్పారు. రియల్మీ-బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రియల్మి స్మార్ట్ టీవీలు, ఫిట్నెస్ బ్యాండ్లు సహా అనేక ఉత్పత్తులు విడుదల చేస్తామని చెప్పారు.

రేపే మరిన్ని వివరాలు
తమ బ్రాండుకు చెందిన పరికరాలన్నింటిని ఉపయోగించేందుకు రియల్మి లింక్ యాప్ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అది యూనివర్సల్ కంట్రోల్ హబ్గానే కాకుండా స్మార్ట్ హోమ్ యాప్గా పని చేస్తుందని భావిస్తున్నారు. రియల్మి సంస్థ నుండి వచ్చే మరిన్ని ఉత్పత్తుల గురించి ఫిబ్రవరి 24న నిర్వహించే రియల్మి ఎక్స్పో 50ప్రో మొబైల్ విడుదల కార్యక్రమంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు.

ఫీచర్స్ వెల్లడించలేదు..
రియల్మి సీఈవో ఫ్రాన్సిస్ వాంగ్ ఇప్పటికే తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఫోటో స్మార్ట్టీవీలకు సంబంధించినదిగా అందరూ భావిస్తున్నారు. రియల్ సౌండ్, రియల్ డిజైన్ రియల్ క్వాలిటీ క్యాప్షన్తో వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. రియల్మీ టీవీల పూర్తి ఫీచర్స్ను, మోడల్స్, ధరలను వెల్లడించలేదు.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications