ఈ నెలాఖరు వరకే టీడీఎస్ ఫైలింగ్ గడువు, ఆలస్యమైతే డబుల్ చెల్లింపు!

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం FY21 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువును జూన్ 30వ తేదీకి పొడిగించింది. ఈ నెలాఖరు నాటికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే డబుల్ టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 206AB ప్రకారం గత రెండేళ్లుగా టీడీఎస్ చెల్లించని పక్షంలో డబుల్ టీడీఎస్ వర్తిస్తుంది. ఈ మేరకు బడ్జెట్ 2021లో కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు.

ఈ నెలాఖరు గడువు దాటితే పన్నుచెల్లింపుదారులు అధిక టీడీఎస్ చెల్లించాల్సి రావచ్చు. గత రెండేళ్లలో ప్రతి సంవత్సరం రూ.50,000కు పైగా టీడీఎస్ మినహాయించుకొని లేదా వసూలు చేసి, ఆ రెండేళ్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే జూలై 1వ తేదీ నుండి ఆదాయ పన్ను శాఖ రెట్టింపు టీడీఎస్ వసూలు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్ 2021లో కొత్త సెక్షన్లు 206ఏబీ, 206సీసీని ప్రవేశపెట్టింది.

 Ready to pay double TDS, If you do not file IT by this month end

ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేసే వారిపై చర్యలు చేపట్టడం ఈ సెక్షన్ల ముఖ్య ఉద్దేశ్యం. రెట్టింపు టీడీఎస్ కొన్ని ట్రాన్సాక్షన్స్, వ్యక్తులకు వర్తించదు. ఇందులో వేతనాలు, పీఎఫ్ అడ్వాన్స్ పైన మినహాయించిన టీడీఎస్, లాటరీ, పజిల్స్, హార్స్ రేస్‌లో గెలిచిన సొమ్ముపై, సెక్షన్ 194ఎన్ కింద రూ.1కోటి నగదు ఉపసంహరణపై, సెక్,న్ 194 ఎల్బీసీ ఆదాయంపై, భారత్‌లో శాశ్వత ఏర్పాట్లు లేని ప్రవాస భారతీయులకు వర్తించదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+