కరోనా మహమ్మారి కారణంగా భారత్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ కారణంగా మన దేశం స్తంభించిపోయింది. ఇలాంటి ఆర్థిక ఒత్తిడిలో ఇండియాకు తన సహకారం కోరితే తప్పకుండా చేస్తానని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. దేశంలో కరోనా విజృంభణతో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. బ్యాంకింగ్, ఏవియేషన్, పర్యాటకం తదితర రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

తీవ్ర సంక్షోభం... మనకు ఆ పరిస్థితి లేదు
ప్రపంచమంతా ఇప్పుడు ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని రాజన్ చెప్పారు. ఇండియా విషయానికి వస్తే మన దేశంలో మొదటి సమస్య విదేశీ మారకద్రవ్యంలో కనిపిస్తుందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో విదేశీ మారకం స్థిరంగా ఉందన్నారు. దీనికి ఆర్బీఐ ఇచ్చే సహకారం కారణం కావొచ్చునన్నారు. అయితే డాలర్తో పోలిస్తే ఇటీవల కొంత క్షీణించిందనే చెప్పాలన్నారు. బ్రెజిల్ వంటి దేశాల్లో దేశాల్లో 25 శాతం క్షీణించిందని, మనకు ఆ పరిస్థితి లేదన్నారు.

పిలిస్తే వస్తా
కరోనాపై పోరులో భారత్లో భాగస్వామి కావడానికి సిద్ధమేనని, పిలిస్తే వస్తానని రాజన్ చెప్పారు. కరోనా మహమ్మారితో పాటు లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోంది. తిరిగి ఉత్తేజపరుచడం ఓ సవాల్. అయితే మోడీ ప్రభుత్వం ఆహ్వానిస్తే దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.

కరోనా తీవ్రంగానే ఉంది..
అమెరికా, ఇటలీ తరహాలో భారత్లోను కరోనా విజృంభిస్తే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని రాజన్ అన్నారు. ఈ వైరస్ను సీరియస్గా తీసుకోవాలన్నారు. ప్రజారోగ్యంపై చూపిస్తోన్న ప్రభావం మన కళ్లకు గడుతోందన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయని, ఆర్థిక మాంద్యానికి నిదర్శనం అన్నారు. తగిన నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఏడాది కోలుకోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్నింటినీ నడపలేదు
ప్రధాని కార్యాలయం నుండి అన్నింటినీ నడపలేమని రాజన్ అన్నారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈ రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. దేశంలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారన్నారు. ప్రధాని కార్యాలయం అన్నింటిని నడపాలని పట్టుబడితే సరికాదని, ఆలస్యమవుతుందని ఇటీవల తన బ్లాగ్లో అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications