ముంబై: కరోనా వైస్ సమయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వేగంగా పెరిగిన విషయం తెలిసిందే. ఫెయిల్యూర్స్, ఫ్రాడ్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త డిజిటల్ పేమెంట్ సెక్యూరిటీ కంట్రోల్ నిబంధనలు జారీ చేయనుంది. సెంట్రల్ బ్యాంకు తన స్టేట్మెంట్ ఆన్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్ సందర్భంగా ఆర్బీఐ డిజిటల్ చెల్లింపు భద్రతానియమాలకు సంబంధించిన ఆదేశాలను జారీ చేయనుందని తెలిపింది.

మార్గదర్శకాలు విడిగా..
నెట్ బ్యాంకింగ్ బదలీలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, కార్డ్ పేమెంట్స్ వంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించి సురక్షితంగా ఉండేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ట్రాన్సాక్షన్స్ వైఫల్యం రేటు కనిష్టానికి తగ్గనున్నాయని తెలిపారు. డిజిటల్ పేమెంట్స్కు సంబంధించి ఆర్బీఐ భద్రతా నియంత్రణకు అధిక ప్రాముఖ్యతను ఇస్తుందని తెలిపింది ఆర్బీఐ. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడిగా జారీ చేయబడతాయని తెలిపింది.

రూ.2వేల నుండి రూ5వేలకు పెంపు
జనవరి 1వ తేదీ నుండి కాంటాక్ట్లెస్ కార్డు ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2వేల నుండి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. కరోనా సమయంలో సమర్ధ, సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉంటాయన్నారు. సురక్షిత డిజిటల్ చెల్లింపుల కోసం కస్టమర్ ఇష్టానుసారం కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్ పరిమితి పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.2వేల వరకు చెల్లింపులు, ట్రాన్సాక్షన్స్ పిన్ నెంబర్ లేకుండా జరుపుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.5,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

24X7 అందుబాటులోకి
RTGS వ్యవస్థను కూడా 24X7 అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు శక్తికాంతదాస్. అనునిత్యం AePS, IMPS, NETC, NFS, RuPay, UPI లావాదేవీలు సదుపాయం ఉంటుందని తెలిపారు. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications