అమెరికాకు ఎగుమతి చేస్తే మీకు సరఫరా ఆపేస్తాం.. అరుదైన ఖనిజాలపై భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన చైనా

ప్రపంచంలో భారీ Rare Earth Magnets ఉత్పత్తిలో చైనా సుమారు 90 శాతం నియంత్రణ కలిగి ఉంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై‑టెక్ పరిశ్రమలకు కీలక ఇన్‌పుట్‌లుగా ఉన్నాయి. ఇవిలేకుంటే ఆటోమొబైల్, వాహనమోటార్, రక్షణ రంగాల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. తాజాగా ఈ మూలకాలపై చైనా భారతదేశానికి ఈ ఖనిజాలను ఎగుమతి చేయడానికి ముందు హామీలు కోరింది.

అమెరికాకు తిరిగి ఎగుమతి చేయకుండా, ఈ అయస్కాంతాలను దేశీయ అవసరాలకు మాత్రమే వినియోగించాలనే హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే సరఫరా ప్రారంభించబడుతుంది. భారతీయ కంపెనీలు ఇప్పటికే తుది వినియోగదారు ధృవీకరణ పత్రాలు (End-User Certificates, EUC) సమర్పించి, సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీలో వీటిని ఉపయోగించబోమని హామీ ఇచ్చాయి.
చైనా ప్రస్తుతం భారీ రేర్ ఎర్త్ (rare earth) ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలో సుమారు 90% నియంత్రణ కలిగి ఉంది.

China rare earth monopoly India rare earth magnets rare earth exports to US China India trade heavy rare earth supply rare earth magnet re-export global rare earth market rare earth trade restrictions India-China trade relations rare earth minerals strategic minerals magnet exports India rare earth diplomacy China export controls India rare earth policy rare earth metals critical minerals trade China US trade India export guarantee rare earth monopoly news rare earth exports to US - - rare earth trade restrictions critical minerals India export guarantee China export controls rare earth monopoly news -

ET నివేదిక ప్రకారం చైనా-యుఎస్ rare earth మీద వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. భారతదేశం కూడా వాస్సేనార్ అరేంజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ విధానాన్ని అనుసరిస్తోంది. ఇది 42 దేశాల ఆందోళనలతో ద్వంద్వ-ఉపయోగ సాంకేతికతలను నియంత్రించడానికి, భద్రతా ఉద్దేశాలతో వస్తువులను బాధ్యతాయుతంగా బదిలీ చేయడానికి రూపొందించబడింది. చైనా అయితే ఈ ఒప్పందానికి వెలుపల ఉండి, భారతదేశానికి సరఫరా చేసే అయస్కాంతాలను USకి వెళ్ళకుండా నిర్ధారించాలి అని డిమాండ్ చేస్తోంది.

ఆగస్టులో షాంఘై సహకార సదస్సు తర్వాత, చైనా భారతదేశానికి తేలికపాటి rare earth magnets సరఫరాను తిరిగి ప్రారంభించింది. అయితే భారీ rare earth magnets సరఫరా ఇంకా నిలిచిపోవడం, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఆటోమొబైల్స్, లారీలు, బస్సుల మోటార్ల అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఈ అయస్కాంతాలు వాహనాల వేగం, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ షిఫ్టింగ్ వంటి సాంకేతిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఏప్రిల్ 4న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విధించిన సుంకాలు తర్వాత, చైనా జాతీయ భద్రతా ఆందోళనలను చూపుతూ మధ్యస్థ, భారీ rare earth ఉత్పత్తులపై ఎగుమతి పరిమితులు అమలు చేసింది. ఎగుమతిదారులు EUC ధృవీకరణ పొందిన తర్వాత మాత్రమే చైనా వాణిజ్య విభాగం నుండి లైసెన్స్ పొందగలుగుతారు. యూరోప్, ఆగ్నేయాసియా కంపెనీలకు ఎగుమతులు తిరిగి ప్రారంభించబడ్డప్పటికీ.. భారతదేశం సరఫరాదారులు ఇంకా ఎగుమతి లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. FY25లో భారతదేశం మొత్తం 870 టన్నుల rare earth magnets దిగుమతులు చేసుకుంది. దీని విలువ రూ. 306 కోట్లు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. చైనా భారతదేశం నుండి ఈ ఖనిజాలను అమెరికాకు తిరిగి ఎగుమతి చేయకూడదనే హామీ కోరుతోంది. ఈ rare earths ను దేశీయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని భారత్ ను డిమాండ్ చేస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+