మీరు రైలులో ప్రయాణికులా.. అయితే మీకు అలర్ట్.. ఈరోజు ఆన్లైన్ మోడ్లో టికెట్ బుక్ చేసుకోవడంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కోల్కతాకు చెందిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్ఎస్) డేటా సెంటర్లో డౌన్టైమ్ యాక్టివిటీని అనుసరించి ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. PRS మూడు గంటల 45 నిమిషాల పాటు మూసివేయనున్నారు.
జూలై 08, 2023 శనివారం 23:45 గంటల నుంచి జూలై 09, 2023 ఆదివారం ఉదయం 03:30 గంటల మధ్య ప్రయాణికులు తమ టిక్కెట్ను ఇంటర్నెట్ మోడ్ ద్వారా బుక్ చేసుకోలేరు. షట్ డౌన్ కార్యకలాపాలు అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, అస్సాం, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల వారు ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో ఇబ్బందులో పడొచ్చు.

షట్ డౌన్ తూర్పు రైల్వే (ER), సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER), ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR), సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR), ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (NFR), ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) జోన్లపై ప్రభావం చూపుతుంది.ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) మూసివేయడంతో ఇంటర్నెట్ బుకింగ్, కరెంట్ బుకింగ్, విచారణలు, చార్టింగ్ ఇతర అనుబంధ సేవలు ప్రభావితం అవుతాయి.
అయితే, ప్రయాణీకులు UTS మొబైల్ అప్లికేషన్ నుంచి సబర్బన్, నాన్-సబర్బన్ (లోకల్) రైళ్ల టిక్కెట్లను కొనుగోలు చేయ్యొచ్చు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల నుంచి కూడా వారు కొనుగోలు చేయవచ్చు. జూలై 07, 2023 నుంచి జూలై 09, 2023 వరకు ప్రణాళికాబద్ధమైన నాలుగు గంటల ట్రాఫిక్ బ్లాక్ కారణంగా పలు రైళ్లు ఆసల్యంగా నడవనున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications