న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో మినిమం నెలసరి బ్యాలెన్స్ లేని కస్టమర్ల నుంచి అన్ని బ్యాంకులు కూడా జరిమానా రూపంలో కొంత మొత్తం వసూలు చేస్తాయి. ఇలాంటి ఛార్జీల రూపంలో ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా దాదాపు రూ.2 వేల కోట్లు వసూలు చేశాయి. ఈ మేరకు సోవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోకసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

గతంలో కంటే తగ్గింది...
2018-19 ఆర్థిక సంవత్సరంలో మినిమం బ్యాలెన్స్ లేనందుకు గాను సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి జరిమానా రూపంలో PSBలు వసూలు చేసిన మొత్తం రూ.1,996.46 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2017-18లో ఇది రూ.3,368 కోట్లకు పైగా ఉంది. ఇది 18 PSBలు వసూలు చేసిన మొత్తం. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది తగ్గుముఖం పట్టింది. కానీ 2016-17తో పోలిస్తే మాత్రం పెరిగింది. నాడు జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ.790.22 కోట్లుగా ఉంది.

SBI ఫైన్...
ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు SBI 2017 అక్టోబర్ 1వ తేదీ నుంచి అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేనిపక్షంలో వేస్తున్న ఫైన్ను చాలా వరకు తగ్గించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. SBI వసూలు చేస్తున్న జరిమానాలపై విమర్శలు రావడంతో 2017 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ ఛార్జీలను గణనీయంగా తగ్గించింది.

BSBD ఖాతాలు..
బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్స్ (BSBD) పైన ఎలాంటి మినిమం బ్యాలెన్స్ జరిమానాలు లేవని కేంద్రమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాల్లో భాగంగా వీటిని ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి వీటిపై ఎలాంటి ఫైన్ లేదు. RBI ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా 57.3 కోట్ల BSBD ఖాతాలు ఉన్నాయి. ఇందులో జన్ ధన్ ఖాతాలు 35.27 కోట్లు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications