పీఎం-కిసాన్(PM Kisan) యోజన కింద 15వ విడత మొత్తం రూ.18,000 కోట్లను బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. జార్ఖండ్లోని ఖుంటిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ ద్వారా 80 మిలియన్ల రైతులకు రూ.18,000 కోట్లు పంపిణీ చేశారు. గత 14వ విడతలో జూలైలో దాదాపు 80.5 మిలియన్ల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లోకి రూ.17,000 కోట్లు జమ చేశారు. ఫిబ్రవరిలో 13వ విడతలో కర్ణాటకలోని బెలగావిలో దాదాపు 80 మిలియన్ల మంది రైతులకు ప్రధాని మోదీ 16,800 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు.
PM-KISAN పథకం కింద 11వ మరియు 12వ వాయిదాలు కూడా మే, అక్టోబర్ 2022లో విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను అండగా నిలవాలని 2019లో పీఎం కిసాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద రైతులకు నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున సంవత్సరానికి రూ.6000 రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 15 విడతలుగా రూ.28,000 రైతుల ఖాతాల్లో జమ చేసింది.

అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే 15వ విడత డబ్బులు జమ అయ్యయాని అధికారులు తెలిపారు. ఈ కేవైసీ ఇప్పటికి చేసుకోకుంటే చేసుకోవాలని కోరుతున్నారు.
https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈకేవైసీ చేసుకోవాలి. అందులో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఈ కేవైసీ, నో యూవర్ స్టేటస్ ఆప్షన్లు ఉంటాయి. అందులో ఈకేవైసీపై క్లిక్ చేయాలి. మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు మీ ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేస్తే మీ ఈకేవైసీ పూర్తవుతుంది. లేకుంటే మీ దగ్గరలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగాలు, టాక్స్ పేయర్స్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఎం కిసాన్ నిధి పథకానికి అనర్హులు. పీఎం కిసాన్ కింద డబ్బులు పడ్డాయో లేదో వెబ్ సైట్ కు వెళ్లి చూసుకోవచ్చు. ఎన్ని విడతులుగా డబ్బులు పడ్డాయో కూడా అందులో ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications