For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Post Office Good news:ఖాతాదారుల విత్‌డ్రా పరిమితి పెంచిన పోస్టల్ శాఖ..ఎంతంటే..?

|

ఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్. మీ ఖాతానుంచి ఇప్పటి వరకు రూ.5వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుండేది. ఇకపై వ్యక్తిగత ఖాతా నుంచి విత్‌డ్రా పరిమితిని రూ.20వేలకు పెంచుతామని పోస్టల్ శాఖ వెల్లడించింది. బ్యాంకులతో పాటు సమానంగా పోటీ పడేందుకే ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు పోస్టల్ శాఖ వెల్లడించింది. విత్‌డ్రా పరిమితి పెంచడం ద్వారా పోస్టల్ శాఖలో కస్టమర్లు కూడా పెరగడమే కాకుండా ఖాతాలు కూడా తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తారని పోస్టల్ శాఖ భావిస్తోంది.

పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలపై విత్‌డ్రా పరిమితిని రూ.5వేల నుంచి రూ 20వేలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు జితేంద్ర సోలంకి. పోస్టల్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో డిపాజిట్ల వరద పారిస్తుందని చెప్పారు. గత కొన్నేళ్లుగా పోస్టల్ శాఖలో డిపాజిట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని చెప్పారు. కానీ ఇప్పుడు విత్‌డ్రా పరిమితిని రూ.20వేలకు పెంచడం ద్వారా చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు పెరుగుతాయని అది కూడా బ్యాంకులతో సమానంగా ఉంటాయని జోస్యం చెప్పారు.

Post office:Good news for savings account holders as the with draw limit is now Rs 20000

ప్రస్తుత రోజుల్లో బ్యాంకు సేవింగ్స్ ఖాతా కలిగి ఉండి,అతనికి బ్యాంకు కేటాయించిన డెబిట్ కార్డు ఆధారంగా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ వాస్తవానికి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల నుంచి ఒక ట్రాన్సాక్షన్‌ కింద రూ.10వేలు కంటే ఎక్కువగా క్యాష్ రావడం లేదు. అయితే పోస్టల్ శాఖలో విత్‌డ్రా పరిమితిని రూ.20వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఆర్థికంగా ఆక్సిజన్ అందించినట్లు అయ్యింది. అంతేకాదు కొత్త ఖాతాదారులు కూడా పోస్టాఫీసుల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని సోలంకి చెప్పారు. వివిధ పోస్టాఫీస్ పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక ప్రస్తుత తరుణంలో చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై వచ్చే వడ్డీని తగ్గించేస్తుండగా.. పోస్టల్ శాఖ మాత్రం తమ సేవింగ్స్ ఖాతాదారులకు వడ్డీని ఏడాదికి 4శాతంగా ఉంచుతోంది. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా నుంచి కనీసం విత్‌డ్రా పరిమితి రూ.50 ఉండగా... కొత్త ఖాతా తెరిచేందుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పోస్టాఫీసులో మినిమం బ్యాలెన్స్ రూ.500 ఉండాల్సి ఉండగా.. ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేసరికి కనీస బ్యాలెన్స్ లేకుంటే, అకౌంట్ మెయిన్‌టెనెన్స్ ఫీజు కింద రూ.100 కోత విధించబడుతుంది. అకౌంట్ బ్యాలెన్స్ సున్నాగా ఉంటే ఖాతాను క్లోజ్ చేయడం జరుగుతుంది.

English summary

Post Office Good news:ఖాతాదారుల విత్‌డ్రా పరిమితి పెంచిన పోస్టల్ శాఖ..ఎంతంటే..? | Post office:Good news for savings account holders as the with draw limit is now Rs 20000

In a bid to provide relief to the rural Post Office Savings Account holders, India Post has announced it will raise the withdrawal limit at Post Office GDS (Gramin Dak Seva) Branches. Now the withdrawal limit per individual will be Rs 20,000 instead of Rs 5,000.
Story first published: Saturday, March 6, 2021, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X