ఇండియా వదిలి పారిపోయిన భారతీయ వ్యాపారవేత్త, 65 ఏళ్ల వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తాజాగా సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే అతని అరెస్ట్ తరువాత ఎన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఈ తరుణంలోనే ముంబైలోని మలబార్ హిల్ గోకుల్ అపార్ట్మెంట్స్లోని మెహుల్ చోక్సీ ఫ్లాట్ మెయింటెనెన్స్ కోసం దాదాపు రూ.63 లక్షలు కట్టాల్సి ఉన్నట్లు వెల్లడైంది.

దీనికి సంబంధించి సొసైటీ మెంబర్ ఒకరు ఈ వాదన చేశారు. ANIతో మాట్లాడుతూ మలబార్ హిల్లోని గోకుల్ అపార్ట్మెంట్స్లోని 9వ, 10వ అలాగే 11వ అంతస్తులలో మెహుల్ చోక్సీకి మూడు ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే అతను ఏడు సంవత్సరాలుగా మెయింటెనెన్స్ కట్టలేదని తెలిపారు.
'మెహుల్ చోక్సీ ఏడు సంవత్సరాలుగా నిర్వహణ చెల్లింపులు బకాయి పడ్డాడు' అని ఆయన అన్నారు. అతనికి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి ఒకటి 9వ అంతస్తు, రెండవది 10వ అంతస్తు, మూడవది 11వ అంతస్తు. 11వ అంతస్తు ఒక టెర్రస్, దానిని అతను చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నాడు. వడ్డీ కాకూండా దాదాపు రూ. 63 లక్షల మెయింటెనెన్స్ పెండింగ్ లో ఉండగా, 2020లో మా కండోమినియంలో రేనోవేషన్ పనులు జరిగాయి, ఒక్కో ఫ్లాట్ కోసం రూ. 30-35 లక్షల ఖర్చు అయింది, కాబట్టి మెహుల్ చోక్సీ మూడు ఫ్లాట్ల ఖర్చును కలిపితే మొత్తం దాదాపు రూ. 95 లక్షలు అవుతుంది అని తెలిపారు.
ఆస్తులను అటాచ్ చేసిన ED: దీనికి సంబంధించి మరికొన్ని విషయాలను వెల్లడిస్తూ 'మెహుల్ చోక్సీ ఫ్లాట్లో ఇప్పటికే చెట్లు కూడా పెరగడం ప్రారంభించాయి, ఈ చెట్ల వేర్లు ఖచ్చితంగా భవనాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఆ ఖర్చు భారం కూడా భరించాలి. మాకు భారతదేశ న్యాయ వ్యవస్థ, ED అధికారులపై నమ్మకం ఉంది, మా బకాయిలు మాకు లభిస్తాయని మేము ఆశిస్తున్నాము అని అన్నారు. అయితే ఈ ఆస్తిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది.
అసలు విషయం ఏంటంటే : ఇండియాని విడిచి బెల్జియం పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఏప్రిల్ 12న అరెస్టు చేసినట్లు ఈడీ ధృవీకరించింది. ప్రస్తుతం అతను ED అధికారుల కస్టడీలో ఉన్నాడు. భారతదేశం కూడా అతన్ని లొంగిపోవాలని కోరింది. పరారీలో ఉన్న 65 ఏళ్ల ఈ వజ్రాల వ్యాపారి 2 జనవరి 2018న భారతదేశం నుండి పారిపోయాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ని రూ. 13,850 కోట్ల మేర మోసం చేశాడనే ఆరోపణలపై CBI అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అతని కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాయి. ఈ మోసంలో అతని మేనల్లుడు నీరవ్ మోడీ కూడా ఉన్నాడు. 2014 నుండి 2017 వరకు మెహుల్ చోక్సీ తన సహచరులు, ఇతర PNB అధికారులతో కుమ్మక్కయ్యాడని ఆరోపించింది. ఈ కాలంలో అతను PNB నుండి లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ అలాగే ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ మోసపూరితంగా పొందాడు. ఈ కారణంగా PNB రూ.6097.63 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications