SBI: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ మెసేజ్లకు స్పందిస్తే అంతే సంగతి..
దేశంలోని అతిపెద్ద బ్యాంకుగా ఎస్బీఐ కొననసాగుతోంది. ఈ బ్యాంకుకు 40 కోట్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. పలువురు ఎస్బీఐ ఖాతాదారులకు పాన్ను అప్డేట్ చేసుకోవాలని కోరుతూ మెసేజ్ లు వస్తున్నాయి. "ప్రియమైన కస్టమర్, ఈ రోజు మీ SBI YONO ఖాతా మూసివేశాం. ఇప్పుడే సంప్రదించండి. మీ పాన్ నంబర్ వివరాలను అప్డేట్ చేయండి"అని మెసేజ్ పంపుతున్నారు. అయితే ఈ సందేశాలు ఫేక్ అని పీఐబీ స్పష్టం చేసింది. ఇలాంటి సందేశాలను నమ్మొద్దని కోరింది.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. ఎస్బీఐ పేరుతో ఫేక్ మెసేజ్ వస్తున్నాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. సందేశంలో కస్టమర్లు తమ ఖాతా బ్లాక్ చేయబడకుండా ఉండటానికి వారి పాన్ నంబర్ను అప్డేట్ చేయమని కోరుతున్నారని తెలిపింది. "SBI పేరుతో జారీ చేయబడిన ఒక నకిలీ సందేశం, ఖాతాదారుల ఖాతా బ్లాక్ చేయబడకుండా ఉండటానికి వారి పాన్ నంబర్ను అప్డేట్ చేయమని అడుగుతోంది" అని PIB ఫ్యాక్ట్ చెక్ చేసిన తాజా ట్వీట్ తెలిపింది.
A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) November 4, 2022
▶️Never respond to emails/SMS asking to share your personal or banking details
▶️Report at👇
✉️ report.phishing@sbi.co.in
📞1930 pic.twitter.com/lYpXTln4qT

ఎప్పుడూ స్పందించకూడదు
ప్రజలు తమ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయమని అడిగే ఇమెయిల్లు/SMSలకు ఎప్పుడూ స్పందించకూడదని PIB హెచ్చరించింది. ప్రజలు అటువంటి నకిలీ సందేశాలను report.phishing@sbi.co.inలో నివేదించవచ్చని PIB తెలిపింది.