For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాక్స్‌ను తగ్గించిన తరువాత: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొత్త రేట్లివీ

|

ముంబై: అంతర్జాతీయంగా మార్కెట్‌లో క్రూడాయిల్ ధర గ్రాఫ్ మళ్లీ పైపైకి దూసుకెళ్తోంది. చాలాకాలం తరువాత 100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్ ధర పెరుగుదల బాట పట్టింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 106.06 డాలర్లు పలుకుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లోనూ ఈ ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 99.10 వద్ద ట్రేడింగ్ నమోదైంది.
ఇదివరకు క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లింది.

విండ్‌ఫాల్ ట్యాక్స్..

విండ్‌ఫాల్ ట్యాక్స్..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు కొంతమేరకైనా తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకుని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌పై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపైనా పడుతుందని భావించినప్పటికీ.. అలాంటివేవీ చోటు చేసుకోలేదు. దేశీయంగా ఇంధన అమ్మకాల్లో పాత రేట్లే కొనసాగుతున్నాయి.

పాతధరలే..

పాతధరలే..

చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం రెండోసారి వ్యాట్‌ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.

వ్యాట్ తగ్గింపు..

వ్యాట్ తగ్గింపు..

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.

ఈ రాష్ట్రాల్లో..

ఈ రాష్ట్రాల్లో..

రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు వ్యాట్ తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.

English summary

కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాక్స్‌ను తగ్గించిన తరువాత: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొత్త రేట్లివీ | Petrol and diesel rates on July 21, 2022: remain unchanged after centre cuts windfall tax cut

Petrol and diesel rates on July 21, 2022: remain unchanged after centre cuts windfall tax cut.
Story first published: Thursday, July 21, 2022, 8:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X