ప్రమాదం నుంచి బయటకు...!: పెరిగిన ప్యాసింజర్ వెహికిల్, బైక్ సేల్స్
అక్టోబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు పుంజుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. గత నెలలో ప్యాసింజర్ 2,48,036 వాహనాలు అమ్ముడుపోగా గత ఏడాది ఇదే సీజన్లో 2,23,498 ప్యాసింజర్ వెహికిల్స్ అమ్ముడుపోయాయి. బైక్స్ విక్రయాలు 5 శాతం పెరిగి 13,34,941కు చేరాయి. గత ఏడాది ఇవి 12,70,261 వద్ద ఉన్నాయి.
తగ్గిన బంగారం, వెండి ధరలు, అప్పటి నుంచి రూ.2,000 తగ్గుదల
వాణిజ్య వాహనాల విక్రయాలు మాత్రం 23 శాతం కుంగి 67,060కు పెరిగాయి. గత ఏడాది ఇవి 87,618గా ఉన్నాయి. ఆటో విక్రయాలు 4 శాతం పెరిగి 59,573కు చేరుకున్నాయి. అక్టోబర్ నెలలో రిటైల్ విక్రయాలు గణాంకాలు ఆటోమొబైల్ పరిశ్రమకు ఊరటను ఇచ్చాయి.
ఆటో పరిశ్రమ తీవ్ర మందగమనంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలకు తోడు సేల్స్ పుంజుకోవడం వంటివి అవసరమని, ఇది డీలర్లకు ఎంతో అవసరమని చెబుతున్నారు. పండుగ సీజన్ చాలా సానుకూలంగా ఉందని, బైక్స్ వాహన మార్కెట్ ప్రమాదం నుంచి బయటపడిందని ఎఫ్ఏడీఏ అధ్యక్షులు ఆశీష్ చెప్పారు.