సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మీ పాన్ను మీ ఆధార్ నంబర్తో లింక్ చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి గడువు కూడా ఎప్పుడో ముగిసింది. అయినా కొంత మంది పాన్ తో ఆధార్ లింక్ చేయలేదు. సమాచార హక్కు (ఆర్టిఐ) అభ్యర్థనకు సమాధానమిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గడువుకు ముందు ఆధార్ కార్డ్లతో అనుసంధానం కానందున మొత్తం 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయని నవంబర్ లో పేర్కొంది.
ఆదాయపు పన్ను నిబంధన ప్రకారం, పాన్ మరియు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. ఆధార్, పాన్ లింక్ చేయడానికి గడువు 30 జూన్ 2023తో ముగిసింది. "భారతదేశంలో 70.24 కోట్ల పాన్ కార్డ్ హోల్డర్లలో, 57.25 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానించారు. 11.5 కోట్ల మంది డియాక్టివేట్ అయ్యాయి. ఇవి ఆధార్తో కనెక్ట్ కాలేదు" అని మధ్యప్రదేశ్ కార్యకర్తకు ఆర్టీఐ సమాధానం ఇచ్చింది.

అయితే ఇప్పుడు కూడా పాన్ తో ఆధార్ లింక్ చేయవచ్చు. కానీ దానికి రూ.1000 జరిమానా చెల్లించి లింక్ చేసుకోవాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA, జూలై 1, 2017 నాటికి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కేటాయించిన, ఆధార్ నంబర్ను పొందేందుకు అర్హులైన ప్రతి వ్యక్తి నిర్ణీత ఫారమ్లో ఆధార్ నంబర్ను తెలియజేయాలి. అయితే చాలా మంది తమ ఆధార్ పాన్ లింక్ అయిందో లేదో తెలుసుకోలేదు. వారు www.incometax.gov.in/iec/foportal/ వెళ్లాళ్లి.
హోమ్పేజీలో 'లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ నంబర్ మరియు ఆధార్ నంబర్ను నమోదు చేయాలి.తర్వాత 'View Link Aadhaar Status'పై క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్ అయిందో లేదో తెలుస్తుంది. లింక్ కాకుంటే రూ.1000 చెల్లించి లింక్ చేసుకోవాలి. పాన్ డియాక్టివ్ అయితే మీరు బ్యాంక్ సంబంధించి అధిక మొత్తంలో లావాదేవీలు జరపలేరు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications