Ritesh Agarwal: హోటల్ ఇండస్ట్రీలో ఓయో పెనుమార్పు సృష్టించింది అనడంలో సందేహం లేదు. CEO రితేష్ అగర్వాల్ ధాటికి అప్పటి వరకు పరిశ్రమలో దిగ్గజ ప్లేయర్స్గా కొనసాగిన కంపెనీలకు పరాభవం తప్పలేదు. సామాజిక కార్యకలాపాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ, రితేష్ ముందుకు సాగుతున్నారు.
వెనుకబడిన ప్రజల అభ్యున్నతి కోసం 5 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఓయో వ్యవస్థాపకులు, CEO రితేష్ అగర్వాల్ ప్రకటించారు. తన సొంతం రాష్ట్రం ఒడిశాలో వచ్చే ఏడాది నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 ఆరోగ్య కేంద్రాలను నడుపుతున్న హెల్త్-టెక్ స్టార్టప్ లాస్ట్ మైల్ కేర్ ఈ కేంద్రాలను నిర్వహించనుంది.

ఆరోగ్య సంరక్షణ సేవలకు దూరంగా ఉన్న ప్రాంతాలను వీటి ద్వారా కవర్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అట్టడుగు ప్రజలకు కూడా హెల్త్ ఫెసిలిటీస్ అందించి, వారి మధ్య అంతరాన్ని తగ్గించాలని చూస్తున్నారు. ఇందుకోసం మొదటి 3 నెలలపాటు ఉచితంగా వైద్య సలహాలు, 6 నెలలు రాయితీతో కూడిన చికిత్స మరియు మందులు అందజేయనున్నారు.
ప్రివెంటివ్ కేర్, డయాగ్నస్టిక్ సేవలు, ప్రాథమిక ఆరోగ్య సేవలు, చిన్నపాటి జబ్బులకు చికిత్స, ప్రొఫెషనల్ కన్సల్టేషన్, రిఫరల్ సేవలు, సరసమైన ధరలకే మందులతో పాటు డిజిటల్ హెల్త్ రికార్డ్ సౌకర్యాలు ఈ కేంద్రాల్లో లభించనున్నాయి. ఇందులో భాగంగా మొదటి ఆరోగ్య కేంద్రం 'రమేష్ & బేలా అగర్వాల్ హెల్త్కేర్ సెంటర్'ను రితేష్ స్వస్థలం రాయగడలో ప్రారంభించారు. ఒడిశా ఎస్సీ & ఎస్టీ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ్ సరాకా చేతుల మీదుగా లాంచ్ చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications