excise duty: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా?

త్వరలో చమురు ధరలు పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఫైనాన్స్ బిల్లు సవరణల్లో భాగంగా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పరిమితిని పెంచనుంది. పెట్రోల్‌పై రూ.10 నుండి రూ.18, డీజిల్‌పై రూ.4 నుండి రూ.12కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఉభయ సభల్లో ఆమోదం లభిస్తే ధరలు పెరగవచ్చు.

ఫైనాన్స్ బిల్లు 2020కు లోకసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండా వాయిస్ ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. ప్రపంచాన్ని, దేశాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ లేకుండా ఆమోదం లభించింది.

overnment raises special excise duty cap on petrol and diesel

ఈ బిల్లు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ ఆర్థిక ప్రతిపాదనలను అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ.30,42,230 కోట్లు ఖర్చు చేయనుంది. 2019-20లో సవరించిన అంచనా కంటే ఇది 12.7 శాతం అధికం.

పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 16.3 శాతం నిధులు పెరిగి రూ.22,45,893కు చేరుకుంటాయని అంచనా. అలాగే నామినల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ గ్రోత్ రేట్ 10 శాతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. 2019-20 నామినల్ గ్రోత్ 12 శాతంగా అంచనా వేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+