LPG Rates: దేశంలోని చమురు విక్రయ కంపెనీలు ప్రతినెల మాదిరిగానే నేడు కొత్త ఎల్పీజీ ధరలను ప్రకటించాయి. ఈ క్రమంలో వాణిజ్య వినియోగదారులు ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ లిండర్ ధరలపై ఊరట లభించింది.
దేశంలో విక్రయిస్తున్న 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరను జూన్ 1 నుంచి మారుతున్నాయి. గత నెల కమర్షియల్ సిలిండర్లపై రూ.171.50 తగ్గించిన చమురు కంపెనీలు నేడు రూ.83.5 తగ్గింపును ప్రకటించాయి. దీంతో రెండు నెలల కాలంలోనే వాణిజ్య సిలిండర్ల ధర రూ.255 తగ్గాయి. అసలే ద్రవ్యోల్బణంతో ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు తాజా తగ్గింపు గొప్ప ఊరటని చెప్పుకోవాలి.

తాజాగా ధరలు తగ్గిన తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో 19 కేజీల సిలిండర్ల ధరలను గమనిస్తే.. ముంబైలో ధర రూ.1,808.50గా ఉన్న ధర రూ.1,725కి తగ్గింది. కోల్కత్తాలో రూ.1,960.50గా ఉన్న సిలిండర్ ధర రూ.1875.50కి దిగొచ్చింది. అలాగే దేశ రాజధానిలో కొత్త ధర రూ.1,773గా ఉంది. ఏప్రిల్ నెలలో కూడా చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల ధరలను రూ.91.50 మేర తగ్గించిన సంగతి తెలిసిందే.
మార్చి నెలలో దేశంలోని చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్లపై ఏకంగా రూ.350.50ను పెంచి తర్వాత.. ఏప్రిల్ నుంచి ఇలా వరుసగా మూడు నెలల నుంచి ధరలు తగ్గిస్తూ ప్రజలకు ఊరటను అందిస్తున్నాయి. ఈ క్రమంలో గృహ వినియోగదారులకు మాత్రం మెుండి చేయి చూపించాయి కంపెనీలు. అనేక నెలలుగా డొమెస్టిక్ సిలిండర్ల ధరల తగ్గింపు కోసం దేశంలోని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నప్పటికీ ధరలు పెరగటమే తప్ప తగ్గింది లేదని చెప్పుకోవాలి. ఈ క్రమంలో చివరగా మార్చిలో గృహ వినియోగదారులు వాడే సిలిండర్లపై రూ.50 మేర ధరను పెంచటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications