LPG Rates: దేశంలోని చమురు విక్రయ కంపెనీలు ప్రతినెల మెుదటి తారీఖున గ్యాస్ సిలిండర్ విక్రయ ధరలను నిర్ణయిస్తుంటాయి. ఈ క్రమంలో నేడు కమర్షియల్ గ్యాస్ లిండర్ వినియోగదారులకు అతిపెద్ద ఊరట లభించింది.
దేశంలో విక్రయిస్తున్న 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధర మే 1 నుంచి మారాయి. చమురు కంపెనీలు తాజాగా ఒక్కో సిలిండర్ పై రూ.171.50ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ప్రకటించిన ధరలు మే 1 నుంచి మే 31 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ముడి సరుకు పెరుగుదల, తగ్గుతున్న వ్యాపారాల సమయంలో వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఇది గొప్ప ఊరటను ఇస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు.

దేశంలోని వివిధ నగరాల్లో 19 కేజీల సిలిండర్ల ధరలను గమనిస్తే ముంబైలో ధర రూ1,808.50 ఉండగా.. కోల్కత్తాలో రూ.1,960.50గా ఉంది. ఇక చెన్నైలో ధరలను గమనిస్తే రూ.2,021.50గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తాజా ధర రూ.1,856.50గా ఉంది. దీనికి ముందు ఏప్రిల్ 1, 2023న ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు 19 కేజీల వాణిజ్య సిలిండర్లపై రూ.91.50ను తగ్గించాయి. తాజా తగ్గింపు దీనికి అదనం.
మార్చి నెలలో దేశంలోని చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్లపై ఏకంగా రూ.350.50ను పెంచగా.. గృహ వినియోగ సిలిండర్లపై రూ.50 మేర ధరలను పెంచాయి. దాదాపు ఏడాదికి పైగా ధరల తగ్గింపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న డొమెస్టిక్ సిలిండర్ వినియోగదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న సామాన్యులు ధరలను తగ్గించకపోవటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications