న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కో లొకేషన్ కుంభకోణం కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఎన్ఎస్ఈ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణ బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు- కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐకి నోటీసులను జారీ చేసింది. నోటీసులను అందుకున్న మరుసటి రోజే సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా పలు చోట్ల విస్తృతంగా దాడులు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎన్ఎస్ఈ కో లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో చిత్ర రామకృష్ణ ఇదివరకే అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీబీఐ అధికారుల కస్టడీలో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇదివరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో బెయిల్ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది.
విచారణ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. దీని తరువాత చిత్ర రామకృష్ణ- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీబీఐకి నోటీసులను జారీ చేసింది. చిత్ర రామకృష్ణ బెయిల్ విషయంలో తన అభిప్రాయాలను తెలియజేయాలంటూ సూచించింది.

ఈ పరిణామం చోటు చేసుకున్న మరుసటి రోజే సీబీఐ కీలక దాడులను నిర్వహించింది. ఇవ్వాళ పలు నగరాల్లో దాడులను చేపట్టింది. స్టాక్ మార్కెట్ బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంది. దేశ రాజధానితో పాటు, ముంబై, కోల్కత, గాంధీనగర్, నొయిడా, గుర్గావ్లల్లో స్టాక్ మార్కెట్ బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ ఉదయం ఆరంభమైన దాడులు.. మధ్యాహ్నం వరకు కూడా కొనసాగాయి.
ఈ సందర్భంగా సీబీఐ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా చిత్ర రామకృష్ణ పలు కీలక విషయాలను వెల్లడించారని, ఆమె ఇచ్చిన సమాచారం మేరకే ఈ దాడులు చేపట్టినట్లు చెబుతున్నారు. దీనిపై సీబీఐ అధికారిక ప్రకటన ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications