కరోనా మహమ్మారి కారణంగా చైనా నుండి పెద్ద మొత్తంలో కంపెనీలు ఇతర దేశాలకు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిని ఆకర్షించేందుకు భారత్ సహా అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా నుండి విదేశీ కంపెనీలు నిష్క్రమించినప్పటికీ దాని వల్ల భారత్కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు.

చైనా కరెన్సీ విలువను తగ్గించుకుంటే..
కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే కారణమని చాలామంది నిందిస్తున్నారని, చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమిస్తే భారత్ లాభపడుతుందని కొందరు అంచనా వేస్తున్నారని, కానీ అలా జరుగకపోవచ్చునని అభిజిత్ అన్నారు. చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఆ దేశ ఉత్పత్తులు మరింత చౌకగా లభిస్తాయన్నారు. దీంతో ప్రజలు వాటి కొనుగోళ్లను ఇప్పటిలాగే కొనసాగిస్తారని చెప్పారు. 'చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే ఏమవుతుంది. ఆ దేశ ఉత్పత్తులు చౌక అవుతాయి. దాంతో ప్రజలు వాటిని కొనడాన్ని కొనసాగిస్తారు' అని అన్నారు.

వారే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తారు
ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు అమెరికా, బ్రిటన్, జపాన్లు తమ జీడీపీలో అధిక మొత్తాన్ని వెచ్చిస్తున్నాయని చెప్పారు. మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈ సమస్య నుండి బయట పడేందుకు కనీసం మూడు లేదా ఆరు నెలల పాటు పేదల చేతికి మరింత నగదు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వాలు సామాన్యుల చేతుల్లోకి డబ్బులు పంపించాలని, వారే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తారని, ధనవంతుల చేతుల్లోకి పంపించవద్దన్నారు.

ఎమర్జెన్సీ రేషన్ కార్డులు
పేదల చేతుల్లోకి మూడు నుండి ఆరు నెలలు మనీ పంపించేందుకు ఎమర్జెన్సీ రేషన్ కార్డులు ఈ కాలానికి గాను ఇష్యూ చేయాలన్నారు. మారటోరియం పొడిగించడం ద్వారా ప్రజలకు మరికొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఇవే కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే డిమాండ్ ముఖ్యమని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్యాకేజీపై..
కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని, ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు జీడీపీలో 1% కంటే తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది ఏమాత్రం చాలదని, దీనిని మరింత పెంచాలని గతంలో నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ఉద్దేశించి అన్నారు. జీడీపీలో కనీసం 10 శాతం ఉండాలని అభిప్రాయపడ్డారు. (అయితే ప్రధాని మోడీ నిన్న రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అంటే 10 శాతం ప్యాకేజీని ప్రకటించారు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications