Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ కు నామినీ యాడ్ చేశారా.. లేకుంటే వెంటనే చేయండి..
మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేవారు తప్పకుండా నామినీని యాడ్ చేయాలని సెబీ స్పష్టం చేసింది. ఇందుకు మార్చి 31, 2023 వరకు గడువు కూడా విధించింది. గత సంవత్సరం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. MF పెట్టుబడిదారులందరూ తమ పెట్టుబడుల కోసం నామినీని జత చేయడం తప్పనిసరి చేసింది. ఒకవేళ నామినీ యాడ్ చేయడంలో విఫలమైతే, మీ పెట్టుబడులు స్తంభింపజేస్తారు.
మార్చి 31, 2023 మ్యూచువల్ ఫండ్ నామినేషన్ గడువు, పెట్టుబడిదారులు తమ హోల్డింగ్లను తనిఖీ చేయడానికి, కష్టపడి సంపాదించిన డబ్బుకు రక్షణ కల్పించడానికి నామినీని యాడ్ చేయాలని రిసోర్స్ స్పెషలిస్ట్, రియల్-ఎస్టేట్ మరియు ఫండ్ మేనేజ్మెంట్ నిపుణులైన సిద్ధార్థ్ మౌర్య అన్నారు. విశ్వసనీయమైన వ్యక్తిని నియమించడం చాలా ముఖ్యమన్నారు. మీ నామినీ(లు) మీ ప్రతినిధిగా పనిచేస్తారని గుర్తుంచుకోండన్నారు.

మీరు అకాల మరణానికి సంబంధించిన విషాదకరమైన సందర్భంలో, మీ పెట్టుబడులు మీ ప్రియమైన వారికి అందజేసేలా చూసుకోవడం చాలా అవసరమని చెప్పారు. నమ్మదగిన వ్యక్తిని ఎన్నుకోవడం, తెలివైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా ఆలస్యం అయ్యే వరకు వేచి ఉండకుండా మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును, మీ స్వంత భవిష్యత్తును రక్షించుకోవడానికి వెంటనే చర్య తీసుకోండని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.
15 జూన్ 2022 నాటి SEBI సర్క్యులర్ ప్రకారం, పెట్టుబడిదారులందరూ తమ వద్ద ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కోసం నామినేషన్ వేయడానికి లేదా నామినేషన్ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేయడానికి అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications