For Quick Alerts
For Daily Alerts
భారీ ఊరట, రూ.2 లక్షలకు పైగా నగదును స్వీకరించవచ్చు
|
ఈ నెల 31వ తేదీ వరకు కరోనా రోగులు లేదా వారి బంధువులు రూ.2 లక్షలకు పైన నగదు చెల్లింపులు చేసినా, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, కొవిడ్ కేర్ కేంద్రాలు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే సదరు రోగి లేదా చెల్లింపుదారుడి పాన్/ఆధార్ వివరాలు సేకరించడం సహా వారి మధ్య సంబంధం తెలుసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుండి మే 31వ తేదీ మధ్య నగదు రూపంలో చెల్లింపులకు సడలింపు మంజూరు చేసినట్లు తెలిపింది.
2016 నవంబర్ డీమానిటైజేషన్ అనంతరం నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రూ.2 లక్షలకు పైగా నగదు చెల్లింపులపై 2017 నుండి నిషేధించారు. ఇంత మొత్తాన్ని నగదు రూపంలో పొందిన ఏ వ్యక్తికి అయినా 100 శాతం జరిమానా విధిస్తారు.
Comments
English summary
భారీ ఊరట, రూ.2 లక్షలకు పైగా నగదును స్వీకరించవచ్చు | Nod for cash payment for COVID bills of over RS 2 lakh
Story first published: Saturday, May 8, 2021, 7:54 [IST]