ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధిక మంది చర్చించుకున్న ఒకే ఒక్క అంశం కరోనా వైరస్. చైనా లో మొదలైన ఈ మహమ్మారి... ప్రస్తుతం సుమారు 150 దేశాలను చుట్టేసింది. యూరోప్ ను గడగడలాడిస్తోంది. చైనా తర్వాత అంతలా కరోనా తో దెబ్బతిన్న దేశం ఇటలీ. ఆ తర్వాత ఇరాన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. సుమారు 2 లక్షల మందికి సోకిన కరోనా వైరస్ ఇప్పటికే దాదాపు 7,000 మంది ప్రాణాలను పొట్టన బెట్టుకుంది.
ఇందులో చైనా లో సగం మంది మరణించగా ... మిగితా సగం మంది వివిధ దేశాల్లో మృతి చెందారు. మన దేశంలోనూ 150 కేసులు, 3 మరణాలు సంభవించాయి. అయితే, భారత దేశంలో ఉన్న ఉష్ణోగ్రత పరిస్థితులు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయని కొందరు భావిస్తున్నారు. సహజంగా దేశంలోని కొన్ని ప్రాంతాలు మినిహా సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు ఉండటం సహజం. అది కూడా ప్రస్తుతం ఎండాకాలం మొదలైంది కాబట్టి, ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎండలు పెరిగితే కరోనా చచ్చి పోతుంది అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

కెసిఆర్ చెప్పింది నిజమేనా....
ఇటీవల కరోనా వైరస్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు... 30 డిగ్రీల ఎండ ఉంటే కరోనా బతికే అవకాశం లేదని ఒక సీనియర్ డాక్టర్ తనకు చెప్పినట్లు వెల్లడించారు. అలాగే పారాసెటమాల్ మాత్రలు వేసుకుంటే దానిని కట్టడి చేయవచ్చని కూడా డాక్టర్ చెప్పారని కెసిఆర్ అన్నారు. దీనిపై అసెంబ్లీ లో ప్రతిపక్షాలు కొంత రాద్ధాంతం చేశాయి. కానీ, దానిపై మళ్ళీ వివరణ ఇచ్చిన కెసిఆర్ ... ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా... వారికి ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన వన్నీ చేస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... ఎండకు కరోనా వైరస్ వ్యాప్తికి ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకునేందుకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక ప్రయత్నం చేసింది. ఈ అంశంపై నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాలను తన కథనంలో వెల్లడించింది.

పాక్షికంగా నిజమే...
మాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ... కరోనా వైరస్ అనేది సరికొత్త వైరస్ కాబట్టి సైంటిఫిక్ కమ్యూనిటీ కి దీని గురించి పెద్దగా తెలియదు. కానీ, మనం ఇప్పటివరకు చూసిన వైరస్/ఫ్లూ లు చలి, పొడి వాతావరణం లో వాటి సంఖ్యను పెంచుకుంటాయని తేలింది. వాతావరణం వేడిగా ఉంటే వాటి పునరుత్పత్తి అంత బాగా జరగదు. 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అది మరింత తగ్గిపోతుంది. ఈ అంశాలను మనం పాత వైరస్లలో చూశాం అని వెల్లడించారు. ఈయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ డైరెక్టర్ కూడా కావటం విశేషం. అంటే, వేడి ఎక్కువగా ఉండే వాతావరణంలో వైరస్ వృద్ధి చెందటం తక్కువగా జరుగుతుందని తేలుతోంది. అలా అని మనం 32 డిగ్రీల ఎండ ఉంది కదా అని వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా... కరోనా వైరస్ తో బాధపడుతున్న వారితో చనువుగా ఉంటానంటే కుదరదు. ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

హ్యూమిడిటీ కారకం...
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రణదీప్ గులేరియా మాత్రం... కరోనా వైరస్ వృద్ధికి హ్యూమిడిటీ (గాలిలో తేమ శాతం) ప్రధాన కారణం అవుతుందని చెప్పారు. ఎండలు పెరిగినంత మాత్రాన వైరస్ చనిపోతుందని భావించనక్కరలేదని పేర్కొన్నారు. అత్యధిక వేడి వాతావరణం ఉన్న సింగపూర్ వంటి దేశాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందటాన్ని అయన ఉదహరించారు. ఢిల్లీ ప్రభుత్వ హెల్త్ కేర్ సర్వీసెస్ విభాగంలో అదనపు డైరెక్టర్ గా పనిచేస్తున్న నూతన్ ముండేజా మాత్రం ఎండకు, కరోనా వైరస్ కు సంబంధం లేదని, అది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని వ్యాఖ్యానించారు. అయితే, ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి ఐన ఎల్ ఎన్ జే పీ మెడికల్ సూపరింటెండెంట్ మాత్రం చలి వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని చెప్పారు. ఉదాహరణకు వైరస్ 8 గంటలు బతకాల్సి ఉంటే ... చలి వాతావరణం కారణంగా అది 2-3 రోజులు కూడా ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. సో, ఈ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మీరు కూడా ఎండకు - కరోనా వైరస్ కు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నించండి.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications