Infosys News: దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లు అందించిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అపాయిట్మెంట్ లెటర్లను అందించింది. రెండు విడతలుగా కంపెనీ ఇటీవల మెయిల్ ద్వారా అప్పట్లో ఎంపికైన విద్యార్థులకు సమాచారం పంపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఐటీ ఉద్యోగుల యూనియన్.. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా ఇన్ఫోసిస్ జాయినింగ్ లెటర్లపై స్పందించారు. గ్రాడ్యుయేట్లు చేరేందుకు ఇచ్చిన తేదీలో ఈసారి ఏదైనా ఉల్లంఘన జరిగితే పూణేకి చెందిన యూనియన్ ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆఫర్ లెటర్ ప్రకారం చేరడం రెండేళ్లుగా ఆలస్యం అయిన 1,000 మంది ఫ్రెషర్లను అక్టోబర్ 7, 2024న చేరాల్సిందిగా కంపెనీ ఇటీవల మెయిల్స్ పంపిన సంగతి తెలిసిందే.

రెండేళ్లుగా ఎదురుచూస్తున్న 1,000 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇన్ఫోసిస్ ఎట్టకేలకు ఆఫర్ లెటర్ను విడుదల చేసింది. నిరంతర ప్రయత్నాలు, ఇన్ఫోసిస్లోని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత కంపెనీ ఆన్ బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించటం సంతోషంగా ఉందని హర్ప్రీత్ సింగ్ సలూజా చెప్పారు.
దాదాపు రెండేళ్లకు పైగా ఎదురుచూపుల్లో గడిపిన గ్రాడ్యుయేట్లకు ఇక వేచిఉండాల్సిన పరిస్థితులు సొమసిపోయాయని అన్నారు. అలాగే ఇది నైట్స్, ఆలస్యాన్ని ఎదుర్కొని బలంగా నిలబడిన విద్యార్థులందరికీ భారీ విజయంగా ఆయన పేర్కొన్నారు.
తాము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉన్నామని సింగ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైతే, గ్రాడ్యుయేట్ల చేరిక తేదీని ఉల్లంఘిస్తే, ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడానికి మేము వెనుకాడబోమని హెచ్చరించారు. అయితే కంపెనీ సీఈవో సాహిల్ పారిఖ్ మాత్రం ఇటీవల విద్యార్థులకు హామీ ఇస్తూ బెంగళూరు ప్రధాన కార్యాలయంలో సిస్టమ్ ఇంజనీర్లుగా ఆఫర్ లెటర్ పొందిన అడుగుపెడతారని చెప్పారు. అయితే ఈ క్రమంలో ప్రీ-ట్రైనింగ్ సెషన్లు తీసుకోవాలని చెప్పారు. అలాగే కంపెనీ ఇచ్చిన ప్రతి ఆఫర్ లెటర్ గౌరవించటానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు పారిఖ్ తెలిపారు.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications