Nirmala Sitharaman: పిల్లలకు స్కూళ్లలోనే అవి నేర్పించాలి..!

భారతదేశాన్ని కొత్త దశాబ్దంలోకి మార్చడమనే అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ క్రమంలో స్కూల్ అండ్ కాలేజ్ సమయంలోనే పిల్లలకు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించాలని అన్నారు. వీటికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం ఆర్బీఐ, సెబీతో పాటు ఇతర సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వీటిని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన ఆవస్యకతను నొక్కి చెప్పారు.

స్వదేశీ రక్షణ పరికరాల తయారీ గురించి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే ప్రక్రియలో కొన్ని కాంపొనెంట్స్, ముడి పదార్థాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని ఆమె అభిప్రాయపడ్డారు. 2024 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతుల విలువ రూ.24,000 కోట్లకు చేరుకుంటుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. భారత రక్షణ పరిశ్రమ తొలిసారిగా రూ.లక్ష కోట్లకు పైగా ఉత్పత్తి విలువతో చారిత్రాత్మక మైలురాయిని సాధించినట్లు చెప్పారు.

Nirmala sitharaman says Financial Literacy Should Be Taught In Schools in modern world

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాలను సీతారామన్ తోసిపుచ్చారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం రానున్న కాలంలో డిమాండ్‌ పెరుగుతుందని నిర్మలమ్మ తెలిపారు. ఈ క్రమంలో యువతకు ఏఐ సామర్థ్యాలను ఉపయోగించుకునే కొత్త డొమైన్‌లలో అవకాశాలను తెరుస్తుందని అన్నారు. ఆర్థిక సంబంధాలు మరియు కరెన్సీ సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మక ఎత్తుగడను సూచిస్తూ.. భారతీయ రూపాయల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు ఆఫ్రికా దేశాలు, రష్యా, శ్రీలంకలతో చర్చలు జరుగుతున్న విషయాన్ని వెల్లడించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+