కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త అందుతుందని చాలా మంది భావించారు. కానీ కేంద్రం అన్నదాతలకు ఎలాంటి శుభవార్త చెప్పలేదు. ముఖ్యంంగా పీఎం కిసాన్ యోజన రూ.6 వేల నుంచి రూ.8 వేలకు పెంచుతారాని అందరు భావించారు. కానీ కేంద్రం మాత్రం అదే రూ.6 వేల సహాయాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పింది. పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2019లో తీసుకొచ్చారు.
ఈ పథకం కింద నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అందిస్తోన్నారు. ఇప్పటికి వరకు 15 విడుతలుగా రైతులు ఖాతాల్లో రూ.30 వేలు జమా చేసింది. అయితే కూలీ ధరలు, ఎరువుల ధరలు, దుక్కి దున్నే ట్రాక్టర్ కిరాయి ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రూ.6 వేల సొమ్మును రూ.8 వేలకు పెంచుతారని అనుకున్నారు. ఎందుకంటే త్వరలోనే లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. కానీ ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ యోజన డబ్బులు పెంచలేదు.

దేశంలో పీఎం కిసాన్ యోజన ద్వారా 11.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామని చెప్పారు. నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం కొత్త పథకం తీసుకొస్తామని చెప్పారు. పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్ గోకుల మిషన్ ద్వారా ఆర్థికసాయం అందిస్తామన్నారు. నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువులు అందిస్తామని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సాయం అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకు వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుందన్నారు. కాగా తెలంగాణలో రైతులు ఆదుకునేందుకు రైతు బంధు అమలు చేస్తున్నారు. త్వరలోనే దీన్ని రైతు భరోసాగా మార్చి సాయాన్ని కూడా పెంచునున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications