కరోనా ఇంఫెక్ట్ దాదాపుగా తగ్గిపోయింది. కొత్త వేరియంట్లు వస్తేనే ప్రభావం ఉండనుంది. దీంతో ఐటీ కంపెనీలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. దీంతో ఐటీ కంపెనీలు కూడా ఆఫీసులు తెరవడానికి రెడీ అవుతున్నారు. విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఎత్తివేసేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఆఫీసులకు రావడానికి కోరే అవకాశం ఉంది.
తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు విప్రో సిద్దమైంది. బెంగళూరుకు చెందిన కంపెనీ మేనేజర్స్, సీనియర్ ఉద్యోగులను మార్చి 3 లోగా కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు మాత్రమే వారిని పిలుస్తారు. ఇక ఉద్యోగులను కూడా పూర్తి స్థాయిలో ఆఫీసులకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తమ ఉద్యోగులను ఏప్రిల్ నాటికి కార్యకలాపాలను ప్రారంభించాలని కాగ్నిజెంట్ చూస్తోంది. ఉద్యోగులను బలవంతం చేయకుండా వారిని పిలిచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2022 నాటికి హైబ్రిడ్ వర్క్ మోడల్ను కొనసాగించాలనే అంచనాతో కంపెనీ ఉన్నట్లు సమాచారం. కాగ్నిజెంట్ ఏప్రిల్ నుంచి వారానికి 3 రోజుల పాటు ఉద్యోగులను తిరిగి ప్రాంగణంలో ఉంచే ప్రణాళికలను కలిగి ఉంది
రిమోట్ వర్కింగ్ పాలసీని తీసుకొచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ట్రెండ్లో చేరింది. కంపెనీ అసోసియేట్స్ ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ, వారిని కంపెనీ బేస్ లొకేషన్ నుంచి పని చేయడం తప్పనిసరి చేసింది. టీసీఎస్ భారీ ఎత్తున్న విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. భవిష్యత్లో 25-25 శాతం మోడల్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తొలుత 25/25 శాతం మంది సిబ్బందిని ఆఫీసులకు తీసుకొచ్చి క్రమంగా హైబ్రీడ్ మోడల్కు మళ్లిస్తామని తెలిపారు.
3-4 నెలల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల కోసం కార్యాలయాలను ప్రారంభించాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది. ఇన్ఫోసిస్లో 96 శాతం మంది వర్క్ ఫ్రం హోం సేవలు కొనసాగిస్తారు. సంస్థ కూడా సిబ్బందిని ఆఫీసులకు రప్పించడానికి తొందరపడటం లేదు. కొవిడ్ కేసుల నేపథ్యంలో హైబ్రీడ్ మోడల్ పని విధానాన్నే కొనసాగించనుంది. 40-50 శాతం సిబ్బందిని ఆఫీసులకు పిలువనున్నారు.


Click it and Unblock the Notifications