నెట్ డైరెక్ట్ ట్యాక్స్ 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లకు జంప్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వసూళ్లు 74 శాతం పెరిగి రూ.5.70 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. అడ్వాన్స్ టాక్స్, టీడీఎస్ వసూళ్లు ఇందుకు ఉపకరించాయి. ఏప్రిల్ 1వ తేదీ - సెప్టెంబర్ 22వ తేదీ మధ్య కాలంలో రూ.5,70,568 కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయని సీబీడీటీ వెల్లడించింది. నికర ప్రత్యక్ష పన్నులు (మొత్తం స్థూల సేకరణ నుండి రీఫండ్స్ తీసివేశాక) సెప్టెంబర్ 22 నాటికి ఈ మొత్తం వసూలయ్యాయి.

గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సేకరించిన రూ.3.27 లక్షల కోట్ల కంటే ఇది 74.4 శాతం అధికమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఓ ప్రకటనలో వెల్లడించింది. 2019-20లో సేకరించిన రూ.4.48 లక్షల కోట్ల కంటే కూడా 27 శాతం అధికమని తెలిపింది. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.6.45 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. ఇది 47 శాతం వృద్ధి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.4.39 లక్షల కోట్లు నమోదయ్యాయి.

Net direct tax mop up grows 74 percent At RS 5.70 lakh crore so far this fiscal

గ్రాస్ కలెక్షన్స్ 16.75 శాతం పెరిగి రూ.5.53 లక్షల కోట్లకు పెరిగాయి. అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా రూ.2.53 లక్షల కోట్లు వసూలయ్యాయి. టీడీఎస్ రూ.3.19 లక్షల కోట్లకు పైగా ఉంది. సెల్ఫ్ అసెస్‌మెంట్ వర్త్ రూ.41,739 కోట్లుగా ఉంది. రెగ్యులర్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూ.25,558 కోట్లు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రూ.4,406 కోట్లు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+