భారత్ నుంచి దిగుమతులు నిలిపేసిన నేపాల్ వ్యాపారులు.. పెద్దమొత్తం VAT విధింపుతో..

Imports: పొరుగు దేశం నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం అక్కడి వ్యాపారుల ఆగ్రహానికి కారణమైంది. దిగుమతులపై 13 శాతం విలువ ఆధారిత పన్ను(VAT) విధిస్తూ సర్కారు తీర్మానించింది. దీంతో భారత్ నుంచి ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇతర కూరగాయల దిగుమతులు నిలిపివేస్తున్నట్లు నేపాల్ ట్రేడర్స్ తెలిపారు.

నేపాల్ ప్రభుత్వ చర్యను అక్కడి ప్రతిపక్షాలు విమర్శించాయి. తక్కువ ఆదాయ వర్గాల ఆహార భద్రతను ఇది ప్రశ్నార్థకంగా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజల వేదనను ఈ చర్య మరింత పెంచుతుందని వాదిస్తున్నారు. మే 29న పార్లమెంటులో ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Nepal traders stops importing Onions, Potatoes due to imposing of 13 Percent VAT

అయితే ఆర్థిక మంత్రి ప్రకాశ్ శరణ్ మహత్ ఈ చర్యను సమర్థించారు. స్థానిక రైతులను ఆదుకోవడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది భారత్ నుంచి దాదాపు లక్షా 74 వేల టన్నుల ఉల్లిపాయలను నేపాల్ దిగుమతి చేసుకుంది. స్థానిక డిమాండ్‌లో 60 శాతం బంగాళాదుంపలను అక్కడే పండిస్తుండగా.. మిగిలినవి భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.

ఉల్లిపాయల కోసం నేపాల్ దాదాపు పూర్తిగా భారతదేశంపై ఆధారపడి ఉన్నందున.. స్థానిక రైతుల కోసం వ్యాట్ అమలు చేస్తున్నామన్న ఆర్థిక మంత్రి వాదనలో అర్థం లేదని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. "వ్యాట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఖాట్మండు వ్యాలీలో రోజూ వెయ్యి టన్నుల ఉల్లిపాయలు ఇండియా నుంచి దిగుమతి అయ్యేవి" అని స్థానిక టోకు వ్యాపారి చెప్పారు. గత 10 రోజులుగా ఉల్లి రావడం ఆగిపోయిందని వెల్లడించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+