Payments News: సులభతర చెల్లింపుల కోసం మోదీ సర్కారు దేశంలో యూపీఐ సేవలను ప్రవేశపెట్టింది. దీనికి ప్రజాదరణ పెరగడంతో ఈ సర్వీసును ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో విరివిగా వినియోగించిన పేమెంట్ సిస్టమ్ తాజాగా ఓ భారీ హిట్ కొట్టింది. అనుకోని అతిథిలా దూసుకొచ్చింది.
UPI ప్రవేశానికి ముందు అత్యంత విరివిగా ఉపయోగించిన చెల్లింపు వ్యవస్థగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(NEFT)ను చెప్పుకోవచ్చు. అయితే కొత్త పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో క్రమేపీ పాత వ్యవస్థ పేరు ప్రజల్లో మసకబారింది. అయితే ఫిబ్రవరి 29న ఈ సిస్టమ్ ఓ సరికొత్త రికార్డు సృష్టించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

లీప్ డే రోజున NEFT 4.10 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. తద్వారా ఇప్పటివరకు ఒక రోజులో అత్యధిక పేమెంట్స్ జరిపిన దినంగా ఫిబ్రవరి 29 NEFT చరిత్రలో నిలిచిపోయింది. ఈ మేరకు ఖచ్చితంగా 4 కోట్ల 10 లక్షల 61 వేల 337 లావాదేవీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. కాగా RTGS వ్యవస్థ గతేడాది మార్చి 31న ఒక రోజులో అత్యధికంగా 16.25 లక్షల లావాదేవీలను ప్రాసెస్ చేసింది.
గత పదేళ్లలో 2014 నుంచి 2023 మధ్య నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) మరియు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS)సిస్టమ్స్ వాల్యూమ్ పరంగా వరుసగా 700 శాతం మరియు 200 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక విలువలో చూస్తే ఈ గణాంకాలు వరుసగా 670 శాతం మరియు 104 శాతంగా రిజర్వ్ బ్యాంక్ డేటా చెబుతోంది. రిటైల్ మరియు టోకు చెల్లింపులను పరిష్కరించడానికి NEFT మరియు RTGS వ్యవస్థలను RBI నిర్వహిస్తుంది .
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications