నరేష్ గోయల్‌పై ఈడీ కేసు నమోదు, సుదీర్ఘ విచారణ

జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనితపై ఈడీ మనీ లాండరింగ్ (PMLA) కింద కేసు నమోదు చేశారు. గతంలో FDI నిబంధనలు ఉల్లంఘించినందుకు ఫెమా కింద ఈడీ అధికారులు గోయల్‌ను ప్రశ్నించారు. తాజాగా ముంబైలోని ఓ ట్రావెల్ సంస్థను గోయల్, ఆయన సతీమణి రూ.46 కోట్లకు మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది.

దీంతో ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా బుధవారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. గోయల్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని, కేసు నమోదు చేశారు. ఆయనను పోలీసులు దాదాపు బుధవారం రాత్రంతా విచారించారు. గోయల్‌ను విచారించామని, అతని ఇంటిలో సోదాలు నిర్వహించామని అధికారులు గురువారం వెల్లడించారు.

Naresh Goyal questioned all night by ED after fresh charges of money laundering

గత ఏడాది ఆగస్ట్ నెలలో విదేశఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ముంబై, ఢిల్లీలోని గోయల్‌కు చెందిన 12 ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో గత ఏడాది ఏప్రిల్ 17న జెట్ ఎయిర్వేస్ సర్వీసులు నిలిపివేసింది. అంతకుముందు మార్చిలో గోయల్ జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. జెట్ ఎయిర్వేస్ నుండి నిధులు మళ్లించినట్లు కార్పోరేట్ వ్యవహారాల శాఖ తన నివేదికలో పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+