అతని తండ్రి రోజుకు రూ.10 సంపాదించేవాడు. కానీ అతను మాత్రం రూ. 2,000 కోట్ల విలువైన సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు. అతనే ముస్తఫా పీసీ. కఠిక పేదరికం నుంచి వచ్చి వేల కోట్లు సంపాదించిన ముస్తఫా పీసీ జీవితం అందరికి ఆదర్శం. "నా తండ్రి రోజుకు 10 రూపాయలు సంపాదించాడు" అని అతను ది నియాన్ షో పాడ్కాస్ట్ హోస్ట్ సిద్ధార్థ అహ్లువాలియాతో చెప్పాడు. ముస్తఫా పీసీ పదేళ్ల వయసులో అతను తన తండ్రికి పొలంలో కట్టెలు సేకరించడం సహాయం చేయడంతో తన పనిని ప్రారంభించాడు.
ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టాడు. కష్టపడి చదివి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నుండి కంప్యూటర్ సైన్స్లో పట్టా పొందారు. తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువుల దిగ్గజం మోటరోలాతో కొన్నాళ్లు పనిచేశాడు. అతని డిగ్రీ తర్వాత అతను దుబాయ్లోని సిటీ బ్యాంక్లో ఉద్యోగం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ముస్తఫా ఇండియాకు వచ్చాడు. అంతేకాదు బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశాడు.

బెంగళూరు ఐఐఎంలో చదువుతున్నప్పుడు ముస్తఫా తన బంధువులతో కలిసి దోసె, ఇడ్లీ పిండి తయారీ కంపెనీని ప్రారంభించాడు. ఐడీ ఫ్రెష్ అనే కంపెనీ 2005లో రూ. 50,000 సీడ్ క్యాపిటల్తో ప్రారంభించాడు. మొదట్ల వారి బిజినెస్ చాలా నెమ్మదిగా సాగింది. అయినా వారి ప్రయత్నం మాత్రం ఆపలేదు. ప్రారంభంలో వారి కంపెనీ రోజుకు కేవలం 10 ప్యాకెట్ల పిండిని విక్రయించేది. కానీ క్రమంగా వారి బిజినెస్ పెరిగింది. వారి బిజినెస్ 10 ప్యాకెట్ల నుంచి 10 వేల ప్యాకెట్లకు చేరుకుంది.
నేడు కంపెనీ రూ. 479 కోట్ల వార్షిక లాభంతో హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్ దిగ్గజంగా ఎదిగింది. ముస్తఫా సరసమైన ధరకు తాజాగా ఇంట్లో తయారు చేసిన & వండడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల అమ్ముతున్నారు. ఐడీ ప్రెష్ దేశంలో ప్రముఖ బ్రాండ్ గా ఎదిగింది. తన కంపెనీతో పాటు ముస్తఫా పీసీ కూడా వ్యాపారవేత్తగా ఎదిగారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications