'మోడీకి అసంతృప్తి ఉంటే నిర్మలా సీతారామన్ను రాజీనామా చేయమని అడగాలి'
ప్రీ-బడ్జెట్ సమావేశాలు అన్నీ ప్రధానమంత్రి కార్యాలయంలో నిర్వహించారని, ఆ సమావేశాలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఆహ్వానించలేదని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. సీతారామన్ పనితీరు పట్ల ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉంటే ఆమెతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేసారు.
బడ్జెట్ సన్నాహక సమావేశాలను ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని, బడ్జెట్కు సంబంధించిన పూర్తి ప్రక్రియ ఆ శాఖ ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామికవేత్తలతో మొత్తం 13 ముందస్తు ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహించారన్నారు.
ఆదాయపు పన్ను గురించి మరిన్ని కథనాలు
కానీ ఈ సమావేశంలోను నిర్మలా సీతారామన్ కనిపించలేదని, ఆమెను ఆహ్వానించలేదన్నారు. ఆమె పని తీరు సంతృప్తిగా లేకుంటే ఆమెను వెంటనే రాజీనామా కోరాలన్నారు. ఆమెను దూరంగా ఉంచడమంటే మొత్తం ఆర్థిక శాఖను నిరుత్సాహానికి గురి చేస్తుందన్నారు.