Mphasis: ప్రస్తుతం ఐటీ పరిశ్రమలోని ఫ్రెషర్ల పరిస్థితి ముందు చూస్తే గొయ్యి వెనుకకు చూస్తే నుయ్యి లాగా తయారైంది. పేరుకి ఆఫర్ లెటర్లు ఉన్నప్పటికీ కంపెనీ తమను ఎప్పుడు ఆన్ బోర్డింగ్ చేస్తుందా అని నెలల తరబడి వేచిచూస్తున్నారు. అలా అని వేరే కంపెనీలో ఉద్యోగం కోసం ట్రై చేద్దామా అంటే మిగిలిన కంపెనీల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ఎంఫసిస్ కంపెనీలో..
దేశీయ ఐటీ కంపెనీ ఎంఫసిస్లో చేరే తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లు కంపెనీకి, రిక్రూట్లకు మధ్య వచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ గడువు పూర్తి కావటంతో జాబ్ ఆఫర్ను కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ సెప్టెంబర్ 2021లో ఎంపికైన ఫ్రెషర్లకు అందించింది. అయితే గడచిన ఏడాది కాలంగా వీరు కంపెనీ ఎప్పుడు పిలుస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ ఇచ్చిన జాబ్ ఆఫర్ మార్చిలో ముగుస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఫ్రెషర్ స్పందన..
2021 సెప్టెంబరులో ఎంఫసిస్ కంపెనీ నుంచి ట్రైనీ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంపికైన ఒక ఫెషర్ దీనిపై స్పందించాడు. తనకు అప్పట్లో కంపెనీ రూ.2.50 లక్షల జీతం అందిస్తామని కంపెనీ ఆఫర్ చేయటంతో అందుకు తాను అంగీకరించినట్లు తెలిపాడు. అయితే కంపెనీ తనను ఆన్ బోర్డ్ చేయలేదని అందుకే గత ఏడాదిగా తాను ఇంట్లోనే వేచి ఉన్నానని తెలిపాడు. అయితే మార్చి 2023తో కంపెనీ ఇచ్చిన ఆఫర్ ముగుస్తుందని.. కంపెనీ వల్ల తాను చాలా కోల్పోయానని ఆవేదన చెందాడు. ఇలాగే నాలుగు లక్షల వార్షిక ప్యాకేజీతో ఎంపికైన మరో వ్యక్తి సైతం ఇదే విషయాన్ని తెలిపాడు.

మరింత మంది ఆందోళన..
మార్చి 2023తో కంపెనీ అందించిన LOI గడువు ముగుస్తున్న నేపథ్యంలో కంపెనీ ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న చాలా మంది ఫ్రెషర్లు అయోమయంలో పడుతున్నారు. ఆఫర్ లెటర్ గడువు తేదీ తర్వాత కంపెనీ తమకు ఉద్యోగం ఇవ్వదేమోనని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై చాలా మంది కంపెనీని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది.

లెర్నింగ్ అకాడమీ శిక్షణ..
కొంత మంది ఎంఫసిస్ లెర్నింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేశారు. ఇది మూడు నెలల పాటు ఉండే కఠినమైన శిక్షణ. ఈ సమయంలో ట్రైనీలకు కంపెనీ ఎలాంటి స్టైఫండ్ను చెల్లించలేదని తెలుస్తోంది. అయితే వారిని కంపెనీ రూ.3.25 లక్షల జీతానికి ఆన్ బోర్డింగ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే వీరికి కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్లు సైతం వచ్చే నెలతో కాలం చెల్లుతాయి. దీంతో చాలా మంది తమ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications